అక్షరటుడే, ఇందూరు: ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా వీక్షించారు. నగరంలోని అర్బన్ కార్యాలయంలో కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి గొప్ప సందేశాన్ని ఇచ్చారని పేర్కొన్నారు. అన్ని రంగాల్లో దేశాన్ని అగ్రగామిగా నిలబెట్టే సత్తా కేవలం మోదీకే ఉందన్నారు. కార్యక్రమంలో సీతారాం పాండే, కమల్, కృష్ణ, గోపాల్, వినయ్, ధన్రాజ్, మారుతి, జయప్రకాష్, బాలకిషన్, ఓం అటల్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
Mann Ki Baat | ఇందల్వాయిలో..

అక్షరటుడే, ఇందల్వాయి: ప్రధాని నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని బీజేపీ నాయకులు ఆదివారం వీక్షించారు. మండలంలోని ఇందల్వాయి గ్రామంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి ఆధ్వర్యంలో టీవీలో ‘మన్ కీ బాత్’ ప్రత్యక్ష ప్రసారాన్ని తిలకించారు. అనంతరం ఇందల్వాయిలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. ప్రభుత్వం తక్షణమే తడిసిన ధాన్యాన్ని కొనాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సత్యనారాయణ, మాజీ అధ్యక్షుడు నాయుడు రాజన్న,చిన్ను, కిషన్, అశోక్, గోపి తదితరులు పాల్గొన్నారు.
Mann Ki Baat | కోటగిరిలో..

అక్షరటుడే, కోటగిరి: ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని పోతంగల్ మండల కేంద్రంలో బీజేపీ నాయకులు వీక్షించారు. 18వ బూత్లోని కార్యకర్త శంకర్ ఇంట్లో బీజేపీ నాయకులు కార్యక్రమాన్ని చూశారు. కార్యక్రమంలో పోతంగల్ మండలాధ్యక్షుడు కల్లూరి హన్మాండ్లు, బాన్సువాడ ఓబీసీ మోర్చా కన్వీనర్ నాగం సాయిలు, మోహన్, హన్మాండ్లు, అశోక్, నాయకులు పాల్గొన్నారు.