అక్షరటుడే, వెబ్డెస్క్ : Cabinet expansion | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి(CM Revanth Reddy) ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. నీతిఆయోగ్ (NITI Aayog) సమావేశంలో పాల్గొనడానికి సీఎం శుక్రవారం ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. శనివారం ఆయన నీతి అయోగ్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్రాల అభివృద్ధికి చేపట్టాల్సిన పలు అంశాలపై చర్చించారు. అయితే సమావేశం అయిపోయినా.. రేవంత్రెడ్డి హస్తినలోనే ఉండిపోయారు.
Cabinet expansion | మంత్రివర్గ విస్తరణకు మోక్షం లభించేనా..
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మంత్రివర్గ విస్తరణ(Cabinet expansion)పై అనేక ఊహగానాలు వచ్చాయి. రేపు మాపు అంటూ 15 నెలలైనా కేబినెట్ విస్తరణ జరగలేదు. ఏప్రిల్లో మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ అధిష్టానం ఓకే చెప్పినా.. రాష్ట్రంలోని పలువురు సీనియర్ నేతలు అడ్డుపడ్డట్లు సమాచారం. ప్రస్తుతం సీఎం రేవంత్రెడ్డి కేబినెట్ విస్తరణపై అధిష్ఠానంతో చర్చించనున్నారు. పార్టీ కార్యవర్గం విస్తరణపై కూడా చర్చించనున్నట్లు సమాచారం. మంత్రివర్గ విస్తరణ కోసం రేవంత్రెడ్డి రాహుల్గాంధీ(Rahul Gandhi), కేసీ వేణుగోపాల్ (KC Venugopal)తో భేటీ కానున్నారు.
Cabinet expansion | పదవులు ఎవరికో..
పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్(PCC Chief mahesh goud) ఇటీవల మాట్లాడుతూ.. మే నెలాఖరు లేదంటే జూన్ మొదటి వారంలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం రేవంత్రెడ్డి ఢిల్లీలో ఇదే అంశంపై చర్చలు జరుపుతున్నారు. అయితే ప్రస్తుతం మూడు మంత్రి పదవులు భర్తీ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఆ పదవులు ఎవరిని వరిస్తాయనే ఉత్కంఠ నెలకొంది.
Cabinet expansion | ఆశావహుల ప్రయత్నాలు
మంత్రి పదవి కోసం కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, వివేక్ వెంకటస్వామి, ఆది శ్రీనివాస్, మల్రెడ్డి రంగారెడ్డి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి తదితరులు ప్రయత్నాలు చేస్తున్నారు. తనకు మంత్రి పదవి రాకుండా జానారెడ్డి అడ్డు పడ్డారని ఇటీవల రాజగోపాల్రెడ్డి వ్యాఖ్యలు కూడా చేశారు. రంగారెడ్డి జిల్లాలో ఒకరికి పదవి ఇవ్వాల్సిందేనని మల్రెడ్డి రంగారెడ్డి పట్టుబడుతున్నారు. వీరితో పాటు పలువురు కొత్త ఎమ్మెల్యేలు సైతం మంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మరి అధిష్టానం ఎవరికి పదవులు ఇస్తుందో చూడాలి.