More
    HomeతెలంగాణMiss England | మిస్ వరల్డ్ 2025 పోటీలకు గుడ్ బై చెప్పిన‌ మిస్ ఇంగ్లాండ్

    Miss England | మిస్ వరల్డ్ 2025 పోటీలకు గుడ్ బై చెప్పిన‌ మిస్ ఇంగ్లాండ్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Miss England | హైద‌రాబాద్ అంతర్జాతీయ స్థాయి కార్యక్రమానికి వేదికగా మారిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్ 2025 (Miss World 2025) పోటీలు జరుగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం (Telangana governament) వీటిని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మిస్ వరల్డ్ పోటీల్లో (Miss World competitions) పాల్గొనడం కోసం దేశ విదేశాల నుంచి వచ్చే పోటీదారులు, సిబ్బందికి కోసం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఇప్పటికే జరిగిన పోటీల్లో ఖండాల వారీగా 24 మంది విజేతలను ఎంపిక చేశారు. వారిలో ఇండియా తరపున నందిని గుప్తా (Nandini Gupta) కూడా ఉన్నారు. ఈనెల 31న హైటెక్స్‌లో గ్రాండ్‌ ఫినాలే పోటీ (grand finale competition) ఉండనుండగా.. ఫైనల్‌ రౌండ్‌లో ప్రపంచ సుందరి (Miss World) ఎవరో తేలనుంది.

    Miss England | ఏంటి ఈ ర‌చ్చ‌..

    మిస్ వరల్డ్ 2025 ఈవెంట్ ఆర్గనైజర్లు (Miss World 2025 event organizers) తనను వేశ్య లాగా చూశారంటూ ఆరోపిస్తూ అందాల పోటీల నుంచి ఓ కంటస్టెంట్ మధ్యలోనే వెళ్లిపోయారు. ఇప్పుడు ఈ వ్య‌వ‌హారం చర్చ‌నీయాంశంగా మారింది. 74 ఏళ్ల మిస్ వరల్డ్ పోటీల చరిత్రలో.. కంటెస్టెంట్ ఇలా మధ్యలో వైదొలగడం ఇదే ప్రథమం. అయితే విదేశీ యువతుల కాళ్లు కడిగించడం, దాని ద్వారా తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం తాకట్టు పెట్టింది అని ప‌లువురు విమ‌ర్శ‌లు వచ్చాయి. ఇక ఇప్పుడు ఇప్పడు బ్రిటన్‌కు చెందిన మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ (Miss England Milla Magee) అనూహ్యంగా ఈ పోటీల నుంచి వైదొలగ‌డం చ‌ర్చ‌నీయాంశం అయింది.

    ముందు milla magee ఆమె వ్యక్తిగత కారణాల వల్ల పోటీల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించినప్పటికీ.. ఆ తర్వాత ఆమె సంచలన ఆరోపణలు చేసింది. ఆమె చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు నెట్టింట వాడీవేడి చర్చ నడుస్తోంది. మిస్ వరల్డ్ పోటీదారులను (Miss World contestants) ఎప్పుడు మేకప్‌తోనే ఉండేలా చేస్తున్నారని.. టిఫిన్ చేసే సమయంలో కూడా మేకప్ తప్పడం లేదని అన్నారు. సాయంత్రం నిర్వహించే కొన్ని కార్యక్రమాల్లో భాగంగా మేల్ స్పాన్సర్లతో కూర్చోవాల్సి వస్తుందని తెలిపారు. ఎప్పుడూ బాల్ గౌన్లోనే ఉండాలని.. ధనవంతులైన స్పాన్సర్లను అలరించాలంటూ తమ మీద ఒత్తిడి తీసుకువస్తున్నారని ఆరోపించారు. తమని వేశ్యలు లాగా చూస్తున్నారంటూ మాగీ సంచలన వ్యాఖ్యలు చేశారు. వినోదం కోసం తమను వీధుల్లో తిప్పారని మాగీ వాపోయారు. దీంతో కాంగ్రెస్ సర్కార్ తెలంగాణ ప్రజల సొమ్ము రూ. 250 కోట్లు ఖర్చు పెట్టి మరీ అంతర్జాతీయంగా తెలంగాణ, హైదరాబాద్ (hyderabad) పరువు తీసిందంటూ బీఆర్ఎస్ పార్టీ విమర్శలు చేస్తోంది.

    Latest articles

    Bangladesh election | బంగ్లాదేశ్ ఎన్నికలకు ముహూర్తం ఖరారు.. ప్రజాస్వామ్య పునరుద్ధరణ దిశగా నిర్ణయం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Bangladesh election : బంగ్లాదేశ్ లో సార్వత్రిక సమరానికి తెర లేవనుంది. వచ్చే ఏడాది ఏప్రిల్లో...

    TASK Training | నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 4,100 ఉద్యోగాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : TASK Training | నిరుద్యోగ యువతకు మంత్రి శ్రీధర్ బాబు గుడ్ న్యూస్ చెప్పారు....

    Kamareddy | భార్య కాపురానికి రావడం లేదని భర్త సూసైడ్

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | భార్య కాపురానికి రావడం లేదని ఓ భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు.. ఈ ఘటన...

    G-7 Summit | ప్రధాని నరేంద్ర మోదీకి జీ-7 ఆహ్వానం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : G-7 Summit | భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi)కి జీ–7 సదస్సుకు...

    More like this

    Bangladesh election | బంగ్లాదేశ్ ఎన్నికలకు ముహూర్తం ఖరారు.. ప్రజాస్వామ్య పునరుద్ధరణ దిశగా నిర్ణయం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Bangladesh election : బంగ్లాదేశ్ లో సార్వత్రిక సమరానికి తెర లేవనుంది. వచ్చే ఏడాది ఏప్రిల్లో...

    TASK Training | నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 4,100 ఉద్యోగాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : TASK Training | నిరుద్యోగ యువతకు మంత్రి శ్రీధర్ బాబు గుడ్ న్యూస్ చెప్పారు....

    Kamareddy | భార్య కాపురానికి రావడం లేదని భర్త సూసైడ్

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | భార్య కాపురానికి రావడం లేదని ఓ భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు.. ఈ ఘటన...