అక్షరటుడే, కామారెడ్డి:RK Educational Institutions | తల్లిదండ్రులు(Parents), విద్యార్థులు(Students) తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని, విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యాబోధన అందిస్తామని ఆర్కే విద్యాసంస్థల సీఈవో(RK Educational Institutions CEO) డా.జైపాల్ రెడ్డి(Dr. Jaipal Reddy) అన్నారు.
బుధవారం వీఆర్కే కళాశాల(RK Collage)లో నిర్వహించిన విద్యార్థులకు అభినందన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సెకండియర్ బైపీసీలో పూర్వజ 994 మార్కులు, ఎంపీసీలో విద్వేష్ 993, సీఈసీలో నందిని CEC-935, ఫస్టియర్ ఎంపీసీలో మైథిలి 467, బైపీసీలో నవోదయ 434, సీఈసీలో అనన్య 491 మార్కులు సాధించడం కళాశాల స్థాయిని పెంచిందన్నారు. అనంతరం ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను మెమోంటోలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శంకర్, కో-ఆర్డినేటర్ దత్తాత్రి, డీన్ నవీన్, శ్రీనివాస్ రెడ్డి, నరేష్, శ్రీవాణి, అధ్యాపకులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.