అక్షరటుడే, వెబ్డెస్క్: Covid | దేశంలో కరోనా మరోసారి గుబులు పుట్టిస్తోంది. గత కొన్ని రోజులుగా కేసుల సంఖ్య పెరుగుతోంది. పలువురు సినీ ఇండ్రస్ట్రీ ప్రముఖులు కోవిడ్ బారిన పడిన విషయం తెలిసిందే. ముంబై, చెన్నె, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో వరుసగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా తెలుగు రాష్ట్రాలకు విస్తరించింది.
గురువారం ఆంధ్రప్రదేశ్లోని విశాఖ పట్నంలో ఓ మహిళకు కరోనా సోకగా.. శుక్రవారం తెలంగాణలో కోవిడ్ కేసు వెలుగు చూసింది. హైదరాబాద్కు చెందిన కూకట్పల్లిలో ఓ వైద్యుడి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. కాగా.. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంటున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కనీస జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని చెబుతున్నారు.