అక్షరటుడే, వెబ్డెస్క్: Raghunandan Rao | మెదక్ ఎంపీ రఘునందన్రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR)కు ఆమె కూతురు, ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) రాసిన లేఖ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ లేఖ పలువురు నాయకులు స్పందించగా.. తాజాగా ఎంపీ రఘునందన్రావు మాట్లాడారు. కవిత లేఖ రాజకీయ పంచాయితీనా.. ఆస్తుల పంచాయితీనా అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబంలో వారసత్వ చిచ్చు మొదలైందని ఆయన ఆరోపించారు.
బీఆర్ఎస్(BRS) నుంచి కవితను బయటకు పంపేందుకు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR), హరీశ్రావు(Harish Rao) ఒక్కటయ్యారని రఘునందన్రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రానున్న రోజుల్లో కవిత మరో షర్మిల(Sharmila) కాబోతుందని ఆయన పేర్కొన్నారు. కవిత కాంగ్రెస్లోకి వెళ్లే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కవిత వెనక సీఎం రేవంత్రెడ్డి(CM Revanth Reddy) ఉన్నట్లు ఎంపీ అనుమానం వ్యక్తంచ చేశారు. ఎవరేం చేసినా తెలంగాణలో బీజేపీదే అధికారం అని ధీమా వ్యక్తం చేశారు.
కాగా.. కవిత లేఖపై స్పందించి బీజేపీ ఎంపీ డీకే అరుణ సైతం సీఎం రేవంత్రెడ్డికి, కవితకు మంచి సంబంధాలు ఉన్నాయని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. కవిత(MLC Kavitha) తన తండ్రికి రాసిన లేఖ ఎలా బయటకు వచ్చిందని ఆమె ప్రశ్నించారు. కాగా కాంగ్రెస్ నాయకులు సైతం కవిత లేఖపై స్పందిస్తూ బీఆర్ఎస్(BRS)లో లుకలుకలు మొదలయ్యాయని విమర్శిస్తున్నారు.