అక్షరటుడే, నిజాంసాగర్: Nizamsagar Project | నిజాంసాగర్ ప్రాజెక్ట్ను (Nizamsagar Project) క్వాలిటీ కంట్రోల్ అధికారుల బృందం గురువారం సందర్శించింది.
ఈ సందర్భంగా చీఫ్ ఇంజినీర్ వెంకటకృష్ణ, ఈఎన్సీ శ్రీనివాస్ ప్రాజెక్ట్ పరిస్థితిని పరిశీలించారు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో వరద గేట్లు పనితీరుపై అడిగి తెలుసుకున్నారు. గ్రీసింగ్, ఆయిల్, తదితర మరమ్మతులపై చర్చించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. క్వాలిటీ కంట్రోల్ ఇన్స్పెక్షన్లో (Quality Control Inspection) భాగంగా ప్రాజెక్ట్ను సందర్శించినట్లు చెప్పారు. వారి వెంట ఎస్ఈ రాజశేఖర్, ఈఈ సోలోమాన్, క్వాలిటీ కంట్రోల్ ఈఈ భూమారెడ్డి, డీఈఈ దత్తాత్రేయ, ఏఈ శివకుమార్, సాకేత్ ఉన్నారు.