అక్షరటుడే, కామారెడ్డి: Flight Journey | పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన భిక్కనూరు మండలానికి చెందిన ఆరుగురు విద్యార్థులకు భిక్కనూరుకు చెందిన ఇన్స్పెక్టర్ మల్లేష్ inspector mallesh విమాన ప్రయాణ అవకాశం కల్పించారు.
భిక్కనూరులో పుట్టిపెరిగిన గడ్డం మల్లేష్ జీడిమెట్ల పోలీస్స్టేషన్లో ఇన్స్పెక్టర్గా పని చేస్తున్నారు. ఆయన సతీమణి సుశీల కెమిస్ట్రీ లెక్చరర్. అయితే భిక్కనూరు ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్న మల్లేష్.. సర్కారు పాఠశాలల్లో ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు సంకల్పించారు.
జడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాల నుంచి ఇద్దరు, బాలికల పాఠశాల నుంచి ఇద్దరు, జంగంపల్లి పాఠశాల నుంచి ఇద్దరిని బెంగుళూరు తీసుకెళ్లారు. అక్కడ విశ్వేశ్వరయ్య విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించడంతో పాటు వివిధ ముఖ్యమైన ప్రదేశాల్ని వారికి చూపించారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు స్ఫూర్తినివ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టామని సుశీల మల్లేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు సహస్ర, స్పందన, వంశిక, సహస్ర, నౌసేన్, మహేష్ ఉన్నారు.