అక్షరటుడే, వెబ్డెస్క్: New Pensions | పెన్షన్ pensions కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త పెన్షన్ల జారీకి చర్యలు చేపట్టింది. ఈ మేరకు కసరత్తు మొదలు పెట్టింది.
రాష్ట్రంలో కొన్నేళ్లుగా కొత్త పెన్షన్లు New Pensions మంజూరు చేయడం లేదు. గతంలో బీఆర్ఎస్ BRS హయాంలో 57 ఏళ్లు నిండిన వారికి పెన్షన్ల కోసం దరఖాస్తులు స్వీకరించి ఎన్నికలకు ముందు కొత్తగా పింఛన్లు ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కొత్త పెన్షన్ల కోసం ప్రజాపాలనలో భాగంగా దరఖాస్తులు స్వీకరించింది. దీంతో చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొత్త పెన్షన్ల కోసం 5.20 లక్షల దరఖాస్తులు పెండింగ్లో pending applications ఉన్నాయి. దీంతో కొత్త పెన్షన్ల జారీకి చర్యలు చేపట్టాలని ప్రభుత్వం government అధికారులను ఆదేశించింది.
ప్రస్తుతం రాష్ట్రంలో దివ్యాంగులకు నెలకు రూ.4,016, ఇతరులకు రూ.2,016 పింఛన్ వస్తోంది. అయితే అధికారంలోకి వస్తే పెన్షన్ రూ.నాలుగు వేలు చేస్తామని కాంగ్రెస్ congress హామీ ఇచ్చింది. కానీ ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా పెన్షన్ల పెంపు ఉండకపోవచ్చు. అయితే కొత్తగా మాత్రం పెన్షన్ల జారీకి క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది.
పెన్షన్ పొందుతున్న వ్యక్తి మరణిస్తే ప్రస్తుతం ఆయన భార్యకు వితంతు పింఛన్ widow pension కోసం మాత్రమే ప్రస్తుతం కొత్తగా దరఖాస్తులు తీసుకుంటున్నారు. అలా దరఖాస్తు చేసుకున్న వారికి రెండు నుంచి మూడు నెలల్లో పింఛన్ ఇస్తున్నారు. అయితే ఇటీవల ఇలాంటి దరఖాస్తులు కూడా భారీగా పెండింగ్లో ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. వారికి వెంటనే పింఛన్ వచ్చేలా చర్యలు చేపట్టాలని ఆదేశించింది.