అక్షరటుడే, డిచ్పల్లి: Telangana University | డిగ్రీ కళాశాలల్లో మూడేళ్లకు ఉన్న తెలుగు భాషను వచ్చే విద్యా సంవత్సరం నుంచి రెండేళ్లకు తగ్గించడాన్ని ఖండిస్తున్నట్లు తెలంగాణ యూనివర్సిటీ తెలుగు శాఖ (TU Telugu Department) అధ్యాపకులు తెలిపారు. తెయూలోని సైన్స్అండ్ ఆర్ట్స్ కళాశాల (College of Science and Arts) సెమినార్ హాల్లో బుధవారం తెలుగు శాఖ అధ్యాపకుల వార్షిక సదస్సు నిర్వహించారు. హెచ్వోడీ సీహెచ్ లక్ష్మణ్ చక్రవర్తి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు తీర్మానాలు చేసి ఆమోదించారు.
యూజీసీ నిబంధనల (UGC regulations) మేరకు భాష, సాహిత్యాల్లో పీజీ కోర్సుకు డిగ్రీలో 20 క్రెడిట్లు ఉండాలనే నియమం ఉందన్నారు. తెలుగును కోర్ సబ్జెక్ట్గా దోస్త్లో సోషల్ సైన్సెస్, కామర్స్ కోర్సుల్లో బకెట్ సిస్టంలో చేర్చాలని కోరారు. తద్వారా ఆసక్తిగల విద్యార్థులు తెలుగు చదివే అవకాశం కల్పించాలన్నారు. కార్యక్రమంలో డీన్ ప్రొఫెసర్ కె.లావణ్య, పి.కనకయ్య, వివిధ కళాశాలల అధ్యాపకులు పాల్గొన్నారు.