అక్షరటుడే, వెబ్డెస్క్ : KTR | మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్(Kaleshwaram Commission) నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నోటీసులపై బుధవారం మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) స్పందించారు. ‘‘మీరు ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఎన్ని డ్రామాలు ఆడినా.. అవన్నీ కూడా తప్పకుండా దూది పింజల్లా తేలిపోతాయి” అని ఆయన అన్నారు. ముమ్మాటికి న్యాయం, ధర్మం గెలుస్తుందని పేర్కొన్నారు.
KTR | కమీషన్ల పాలన
కేటీఆర్ బుధవారం నల్గొండలో మీడియాతో మాట్లాడారు. దిక్కుతోచని పరిస్థితుల్లోనే కేసీఆర్(KCR)కు నోటీసులు ఇచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజాపాలన కాస్త కమీషన్ల పాలనగా మారిందని విమర్శించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులే కమిషన్లు లేనిదే పనులు జరగడం లేదని చెబుతున్నారని అన్నారు. చట్టాల మీద తమకు విశ్వాసం ఉందని ఆయన పేర్కొన్నారు. ఇదంతా కాంగ్రెస్, బీజేపీ కలిసి ఆడుతున్న నాటకమని పేర్కొన్నారు.
KTR | ప్రజల దృష్టి మరల్చడానికే..
కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) 17 నెలలైనా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని కేటీఆర్ మండిపడ్డారు. ఆ హామీల అమలు చేతకాక ప్రజల దృష్టి మరల్చడానికి నోటీసులు ఇచ్చారని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కుట్రలు చేస్తూ రాష్ట్ర అభివృద్ధిని బలిగొడుతున్నారని ఆరోపించారు. రేవంత్రెడ్డి(Revanth Reddy)కి త్వరలోనే ప్రజలు బుద్ధి చెబుతారన్నారు.