More
    HomeతెలంగాణCM Revanth Reddy | ట్రంప్​ ఒత్తిడికి మోదీ లొంగిపోయారు.. సీఎం సంచలన వ్యాఖ్యలు

    CM Revanth Reddy | ట్రంప్​ ఒత్తిడికి మోదీ లొంగిపోయారు.. సీఎం సంచలన వ్యాఖ్యలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్‌:CM Revanth Reddy | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ ఒత్తిడికి భయపడి లొంగిపోయారని సీఎం రేవంత్​రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతరత్న, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా సచివాలయం ఎదురుగా ఉన్న రాజీవ్‌ గాంధీ విగ్రహానికి సీఎం నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల ఆపరేషన్​ సిందూర్​ అనంతరం ట్రంప్​ భయపెట్టడంతో మోదీ కాల్పుల విరమణకు అంగీకరించారన్నారు.


    కేంద్ర ప్రభుత్వం(Central Government) పాకిస్తాన్​ను చిత్తు చేసే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా వెనకడుగు వేసిందన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్(US President Trump​)​ ఒత్తిడి తీసుకొచ్చి యుద్ధాలు ఆపానని చెబుతున్నారన్నారు. ఆర్థిక ప్రయోజనాలు దెబ్బ తీస్తానని చెప్పడంతో భారత్​ ​ కాల్పుల విరమణకు అంగీకరించదని చెప్పారన్నారు. దేశంలో నడుస్తున్న ప్రభుత్వం ట్రంప్​ ఒత్తిడికి లొంగిపోయిందన్నారు. గతంలో పాక్‌తో యుద్ధం జరిగినప్పుడు అమెరికా ఒత్తిళ్లను ఇందిరాగాంధీ పట్టించుకోలేదన్నారు. ఈ అంశంలో అమెరికా ఒత్తిడికి మోదీ సర్కార్‌ తలొగ్గిందని సీఎం ఆరోపించారు.

    READ ALSO  Payal Shankar | రాష్ట్రానికి చేయూతనిచ్చిన కేంద్రం

    ఆపరేషన్​ సిందూర్(Operation Sindoor)​ అనంతరం భారత్​ దళాలు పాకిస్తాన్​ను చిత్తు చేస్తున్న సమయంలో ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించిన విషయం తెలిసిందే. అయితే తానే కాల్పుల విరమణకు రెండు దేశాలను ఒప్పించినట్లు ప్రకటించారు. అయితే భారత్​ మాత్రం పాకిస్తాన్(Pakistan)​ కోరడంతో కాల్పుల విరమణకు ఒప్పుకున్నట్లు చెబుతోంది. అయితే ట్రంప్​ ముందుగా ప్రకటించడంతో విపక్ష పార్టీలు కేంద్రాన్ని విమర్శిస్తున్నాయి. ఈ క్రమంలో సీఎం రేవంత్​రెడ్డి వ్యాఖ్యలు చేశారు.
    కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

    Latest articles

    Nizamabad Collector | కలెక్టర్​ను కలిసిన నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం నాయకులు

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad Collector | జిల్లా కలెక్టర్​గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన వినయ్ కృష్ణారెడ్డిని జిల్లా నాలుగో...

    CP Sai Chaitanya | సీపీని కలిసిన బెటాలియన్​ కమాండెంట్

    అక్షరటుడే, డిచ్​పల్లి: CP Sai Chaitanya | డిచ్​పల్లి 7వ బెటాలియన్​ కమాండెంట్​ సత్యనారాయణ (7th Battalion Commandant...

    Raja Raghuvanshi | మేఘాల‌య హనీమూన్ జంట విషాదంలో కొత్త కోణం.. మూడు నెల‌ల ముందే హ‌త్య‌కు కుట్ర‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Raja Raghuvanshi | హనీమూన్‌ కోసం మేఘాలయ వెళ్లి అక్కడ హత్యకు గురైన ఇండోర్ వ్యాపారవేత్త...

    Rythu Bharosa | అన్నదాతలకు గుడ్​న్యూస్​.. రేపటి నుంచి రైతు భరోసా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rythu Bharosa | ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి (Chief Minister Revanth Reddy) అధ్యక్షతన మంత్రివర్గ...

    More like this

    Nizamabad Collector | కలెక్టర్​ను కలిసిన నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం నాయకులు

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad Collector | జిల్లా కలెక్టర్​గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన వినయ్ కృష్ణారెడ్డిని జిల్లా నాలుగో...

    CP Sai Chaitanya | సీపీని కలిసిన బెటాలియన్​ కమాండెంట్

    అక్షరటుడే, డిచ్​పల్లి: CP Sai Chaitanya | డిచ్​పల్లి 7వ బెటాలియన్​ కమాండెంట్​ సత్యనారాయణ (7th Battalion Commandant...

    Raja Raghuvanshi | మేఘాల‌య హనీమూన్ జంట విషాదంలో కొత్త కోణం.. మూడు నెల‌ల ముందే హ‌త్య‌కు కుట్ర‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Raja Raghuvanshi | హనీమూన్‌ కోసం మేఘాలయ వెళ్లి అక్కడ హత్యకు గురైన ఇండోర్ వ్యాపారవేత్త...