అక్షరటుడే, వెబ్డెస్క్:CM Revanth Reddy | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడికి భయపడి లొంగిపోయారని సీఎం రేవంత్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతరత్న, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా సచివాలయం ఎదురుగా ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి సీఎం నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల ఆపరేషన్ సిందూర్ అనంతరం ట్రంప్ భయపెట్టడంతో మోదీ కాల్పుల విరమణకు అంగీకరించారన్నారు.
కేంద్ర ప్రభుత్వం(Central Government) పాకిస్తాన్ను చిత్తు చేసే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా వెనకడుగు వేసిందన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్(US President Trump) ఒత్తిడి తీసుకొచ్చి యుద్ధాలు ఆపానని చెబుతున్నారన్నారు. ఆర్థిక ప్రయోజనాలు దెబ్బ తీస్తానని చెప్పడంతో భారత్ కాల్పుల విరమణకు అంగీకరించదని చెప్పారన్నారు. దేశంలో నడుస్తున్న ప్రభుత్వం ట్రంప్ ఒత్తిడికి లొంగిపోయిందన్నారు. గతంలో పాక్తో యుద్ధం జరిగినప్పుడు అమెరికా ఒత్తిళ్లను ఇందిరాగాంధీ పట్టించుకోలేదన్నారు. ఈ అంశంలో అమెరికా ఒత్తిడికి మోదీ సర్కార్ తలొగ్గిందని సీఎం ఆరోపించారు.
ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) అనంతరం భారత్ దళాలు పాకిస్తాన్ను చిత్తు చేస్తున్న సమయంలో ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించిన విషయం తెలిసిందే. అయితే తానే కాల్పుల విరమణకు రెండు దేశాలను ఒప్పించినట్లు ప్రకటించారు. అయితే భారత్ మాత్రం పాకిస్తాన్(Pakistan) కోరడంతో కాల్పుల విరమణకు ఒప్పుకున్నట్లు చెబుతోంది. అయితే ట్రంప్ ముందుగా ప్రకటించడంతో విపక్ష పార్టీలు కేంద్రాన్ని విమర్శిస్తున్నాయి. ఈ క్రమంలో సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలు చేశారు.
కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.