అక్షరటుడే, కామారెడ్డి: Tiranga Rally | భారత ఖ్యాతిని చాటిచెప్పిన త్రివిధ దళాలు, భారత సైన్యానికి పాదాభివందనం చేస్తున్నామని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి (Kamareddy MLA Katipally Venkata Ramana Reddy) అన్నారు.
సోమవారం రాత్రి కామారెడ్డి పట్టణంలోని గాంధీ గంజ్, జేపీఎన్ రోడ్, సిరిసిల్ల రోడ్, స్టేషన్ రోడ్డు, రైల్వే కమాన్ మీదుగా నిజాంసాగర్ చౌరస్తా వరకు భారీ తిరంగార్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor)ను విజయవంతం చేయడానికి భూమిపై, గాలిలో సముద్రంలో ధైర్యంగా పోరాడిన మన సైనికుల ధైర్యసాహసాలను గౌరవించేందుకు కామారెడ్డి ప్రజలు నేడు కామారెడ్డి పట్టణంలో తిరంగాయాత్ర (Tiranga Yatra) చేపట్టామన్నారు. భారత సైన్యం, త్రివిధ దళాల తెగువ 23 నిమిషాల పాటు ప్రపంచానికి చాటి చెప్పారన్నారు. వారి తెగువ చాలా గొప్పదని కొనియాడారు.

కామారెడ్డి పట్టణంలో తిరంగా ర్యాలీలో పాల్గొన్న ప్రజలు