అక్షరటుడే, వెబ్డెస్క్: GPO Posts | గ్రామ పాలన అధికారుల GPO నియామకంపై కీలక అప్డేట్ వచ్చింది. జీపీవో పోస్టుల భర్తీ కోసం మే 25న స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణలో కాంగ్రెస్ congress అధికారంలోకి వచ్చాక భూ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామని తెలిపింది. ఈ క్రమంలో ధరణి Dharani స్థానంలో భూ భారతి Bhu Bharati పోర్టల్ అమలులోకి తీసుకొచ్చింది. భూ భారతి అమలుకు జీపీవోలు కీలకం అని ప్రభుత్వం భావిస్తోంది.
GPO Posts | 6,120 దరఖాస్తులు
గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థను పటిష్టం చేయడం కోసం జీపీవోలను నియమించాలని ప్రభుత్వం భావించింది. మొత్తం 10,941 పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించింది.ఇందుకోసం గతంలో వీఆర్వో vro, వీఆర్ఏ vraలుగా పని చేసిన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించింది. అయితే 6,120 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. వీరికి స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించిన అనంతరం నియామక పత్రాలు అందించనున్నారు.
వీరికి మే 25న ఉదయం ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. హాల్టికెట్లను halltickets త్వరలోనే ఆన్లైన్లో విడుదల చేసే అవకాశం ఉంది. పోస్టుల కంటే తక్కువ సంఖ్యలో దరఖాస్తులు రావడంతో వీఆర్వో, వీఆర్ఏ, గ్రామస్థాయి రెవెన్యూ అంశాలపై పరీక్ష పెట్టి వారిని ఎంపిక చేయనున్నట్లు సమాచారం. మిగతా పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసే అవకాశం ఉంది.