అక్షరటుడే, వెబ్డెస్క్: IPL 2025 | చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (mahendra singh dhoni) అభిమానులకు శుభవార్త. అతని రిటైర్మెంట్పై (retirement) కీలక అప్డేట్ వచ్చింది. వచ్చే సీజన్ (next season) కూడా ధోనీ ఆడుతాడని టైమ్స్ ఆఫ్ ఇండియా (times of india) పేర్కొంది. రిటైర్మెంట్పై ఇప్పుడే తుది నిర్ణయం తీసుకోలేనని సీఎస్కే (CSK) యాజమాన్యానికి ధోనీ తెలిపినట్లు తమ కథనంలో రాసుకొచ్చింది.
సీఎస్కే జట్టులో (CSK team) ఇంకా పరిష్కరించాల్సిన అంశాలు చాలా ఉన్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో రిటైర్మెంట్ ప్రకటించడం సరికాదని ధోనీ భావిస్తున్నాడట. ఇప్పటికే ధోనీ కూడా ఈ విషయాన్ని వెల్లడించాడు. ఏడాదిలో తాను ఆడే రెండు నెలలు మాత్రమేనని, రిటైర్మెంట్పై ఇప్పుడే నిర్ణయం తీసుకోలేనని స్టార్ స్పోర్ట్స్తో (star sports) అన్నాడు.
ఈ సీజన్లో సీఎస్కే ఆటతీరు తీవ్రంగా నిరాశపరిచినప్పటికీ, జట్టులో యువ ఆటగాళ్లకు మార్గనిర్దేశం చేయడానికి ధోనీ (dhoni) అనుభవం చాలా ముఖ్యమని టీమ్మేనేజ్మెంట్ (team management) భావిస్తోంది. రిటైర్మెంట్ విషయంలో ధోనీకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు ఇప్పటికే సీఎస్కే యాజమాన్యం ప్రకటించింది. ఈ క్రమంలోనే ధోనీ వచ్చే సీజన్ కూడా ఆడే అవకాశం ఉంది.
ఐపీఎల్ 2025 సీజన్లో (IPL 2025 season) సీఎస్కే 12 మ్యాచ్లు ఆడి 3 మ్యాచ్ల్లోనే గెలుపొందింది. ప్లే ఆఫ్స్ రేసు (play off race) నుంచి తప్పుకుంది. ఈ క్రమంలోనే వచ్చే సీజన్పై సీఎస్కే ఫోకస్ పెట్టింది. కుర్రాళ్ల సత్తాను పరీక్షిస్తోంది.