More
    Homeక్రీడలుNeeraj Chopra | నీరజ్​ చోప్రా సరికొత్త రికార్డు

    Neeraj Chopra | నీరజ్​ చోప్రా సరికొత్త రికార్డు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Neeraj Chopra | భారత స్టార్​జావెలిన్​త్రో ప్లేయర్‌ నీరజ్ చోప్రా(Neeraj Chopra) సరికొత్త రికార్డు సృష్టించాడు. భారత్​కు రెండు ఒలింపిక్​ పతకాలు అందించిన నీరజ్​ తాజాగా దోహా డైమండ్‌ లీగ్‌(Doha Diamond League)లో ఈటెను 90.23 మీటర్లు విసిరాడు. తన కెరీర్​లో తొలిసారి 90 మీటర్ల మార్క్‌ను నీరజ్ చోప్రా అధిగమించడం గమనార్హం. కాగా గతంలో ఆయన అత్యధికంగా 89.4 మీటర్లు దూరం ఈటెను విసిరాడు. తాజాగా ఆ రికార్డును బద్దలు కొట్టాడు. దోహలో జరిగిన పోటీల్లో మొదటి ప్రయత్నంలో ఈరజ్​జావెలిన్‌ను 88.44 మీటర్ల దూరం విసిరాడు. అనంతరం రెండో ప్రయత్నంలో ఫౌల్‌ అయ్యాడు. మూడో సారి 90.23 మీటర్ల మార్క్‌ అందుకున్నాడు. నాలుగో ప్రయత్నంలో 80.56 మీటర్లు విసిరిన నీరజ్‌ ఐదోసారి మళ్లీ ఫౌల్‌ అయ్యాడు. జర్మనీకి చెందిన జులియన్‌ వెబర్‌ ఏకంగా 91.06 మీటర్లు విసిరాడు. దీంతో ఆయన విజేతగా నిలవగా.. నీరజ్​ రెండోస్థానంతో సరిపెట్టుకున్నారు.

    READ ALSO  ENG vs IND Match | ఉత్కంఠ‌గా మారిన తొలి టెస్ట్.. సెకండ్ ఇన్నింగ్స్‌లో నిల‌క‌డ‌గా ఆడుతున్న భార‌త్

    Neeraj Chopra | రెండు ఒలింపిక్​ పతకాలు

    నీజర్​ చోప్రా భారత్​కు రెండు ఒలింపిక్​ పతకాలు(India Two Olympic medals) అందించాడు. 2020లో టోక్యోలో జరిగిన విశ్వ క్రీడల్లో బంగారం పతకం సాధించి నీరజ్​ చరిత్ర సృష్టించాడు. అథ్లెటిక్స్(Athletics)​ విభాగంలో బంగారు పతకం(Gold Medal) సాధించిన తొలి భారతీయుడిగా నిలిచాడు. ఆ సమయంలో ఆయన 87.58 మీటర్ల దూరం బల్లెం విసిరాడు. 2024లో పారిస్​లో జరిగిన ఒలింపిక్స్​లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన నీజర్​ రజత పతకం(Silver medal)తో సరిపెట్టుకున్నాడు. ఈ ఈవెంట్​లో నీరజ్​ 89.45 మీటర్ల దూరం జావెలిన్​ విసిరాడు. అయితే పాకిస్తాన్​ ప్లేయర్​ అర్షద్​ 92.97 మీటర్లు విసిరి ఆ పోటీల్లో బంగారు పతకం సాధించాడు. అయితే తాజాగా నీరజ్​ తన కెరీర్​లో తొలిసారి 90 మీటర్లు కంటే ఎక్కువ దూరం జావెలిన్​ను విసిరాడు.

    READ ALSO  ENG-W vs IND-W | స్మృతి మంధాన అద్భుత సెంచరీ.. మహిళల T20I లో సెంచరీ సాధించిన రెండో భారతీయురాలిగా రికార్డు

    Latest articles

    Turmeric Board inauguration | ఇందూరు పసుపునకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు : కేంద్ర మంత్రి అమిత్​ షా

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Turmeric Board inauguration | ఇందూరు పసుపు విశ్వవ్యాప్తం అవుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్​...

    NCC Students | ఎన్​సీసీ విద్యార్థుల ప్లకార్డుల ప్రదర్శన

    అక్షరటుడే ఇందూరు: NCC Students | జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభం నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్...

    DS Statue | డీఎస్​ విగ్రహాన్ని ఆవిష్కరించిన అమిత్​షా

    అక్షరటుడే, ఇందూరు: DS Statue | జిల్లా కేంద్రంలోని కంఠేశ్వర్​ బైపాస్​ చౌరస్తాలో ఏర్పాటు చేసిన దివంగత మాజీ...

    MP Raghunandan Rao | మరికాసేపట్లో చంపేస్తాం.. ఎంపీ రఘునందన్​రావుకు మరోసారి బెదిరింపులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : MP Raghunandan Rao | బీజేపీ ఎంపీ రఘునందన్ రావుకు మరోసారి బెదిరింపు కాల్...

    More like this

    Turmeric Board inauguration | ఇందూరు పసుపునకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు : కేంద్ర మంత్రి అమిత్​ షా

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Turmeric Board inauguration | ఇందూరు పసుపు విశ్వవ్యాప్తం అవుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్​...

    NCC Students | ఎన్​సీసీ విద్యార్థుల ప్లకార్డుల ప్రదర్శన

    అక్షరటుడే ఇందూరు: NCC Students | జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభం నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్...

    DS Statue | డీఎస్​ విగ్రహాన్ని ఆవిష్కరించిన అమిత్​షా

    అక్షరటుడే, ఇందూరు: DS Statue | జిల్లా కేంద్రంలోని కంఠేశ్వర్​ బైపాస్​ చౌరస్తాలో ఏర్పాటు చేసిన దివంగత మాజీ...