అక్షరటుడే, హైదరాబాద్: Tiranga Vijaya Yatra : పహల్గామ్ ఉగ్రదాడి(Pahalgaon terror attack)కి ప్రతిగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) విజయవంతంగా కొనసాగింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా తిరంగా విజయయాత్ర చేపట్టాని బీజేపీ పిలుపునిచ్చింది. ఈ మేరకు తెలంగాణ బీజేపీ(Telangana BJP) యూనిట్ శనివారం (మే 17) హైదరాబాద్ లో తిరంగా యాత్ర చేపట్టనుంది.
ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని వాహనదారులకు నగర ట్రాఫిక్ పోలీసులు కీలక సూచనలు చేశారు. మహానగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు(Traffic restrictions) విధిస్తున్నట్లు ప్రకటించారు.
శనివారం సాయంత్రం 5.30 నుంచి 7.30 వరకు అంబేడ్కర్ విగ్రహం, సచివాలయం జంక్షన్, పెల్లింగ్ క్లబ్, డీబీఆర్ మిల్స్, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. ఈ సమయంలో వాహనాలను దారి మళ్లించనున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని ట్రాఫిక్ అడిషనల్ సీపీ జోయల్ డేవిస్ సూచించారు.
తిరంగా ర్యాలీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy), బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు (BJP MLAs, MPs) ఇతర పార్టీల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు హాజరుకానున్నారు.