More
    HomeజాతీయంDefence Ministry | భారత్​ కీలక నిర్ణయం.. రక్షణ శాఖకు భారీగా నిధులు!

    Defence Ministry | భారత్​ కీలక నిర్ణయం.. రక్షణ శాఖకు భారీగా నిధులు!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Defence Ministry | భారత రక్షణ రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా కేంద్రం అనేక చర్యలు చేపడుతోంది. ఇప్పటికే పలు దేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేయడంతో దేశీయంగా ఆయుధాలను తయారు చేస్తోంది. ముఖ్యంగా వివిధ రకాల మిసైళ్లను రూపొందిస్తోంది. అయితే ఆపరేషన్​ సిందూర్(Operation Sindoor)​ అనంతర పరిణామాల నేపథ్యంలో రక్షణ రంగానికి భారీగా నిధులు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించినట్లు సమాచారం.

    Defence Ministry | అదనంగా రూ.50 వేల కోట్లు

    ఈ ఆర్థిక సంవత్సరంలో రక్షణ శాఖకు రూ.6.81 లక్షల కోట్ల బడ్జెట్​ కేటాయించారు. అయితే పహల్​గామ్​ ఉగ్రదాడి(Pahalgam terror attack) అనంతరం భారత్​ ఆపరేషన్​ సిందూర్​ చేపట్టి పీవోకేతో పాటు పాకిస్తాన్​లోని 9 ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసింది. భారత్​ దాడితో దెబ్బతిన్న పాక్​ ప్రతీకారదాడులకు దిగింది. వందల సంఖ్యలో డ్రోన్లు, మిసైళ్లతో భారత్​లోని సైనిక స్థావరాలపై దాడికి యత్నించింది. అయితే భారత గగనతల రక్షణ వ్యవస్థ ఎస్​–400, ఆకాశ్​ క్షిపణులు వాటిని అడ్డుకున్నాయి. అనంతరం భారత్​ ప్రతిదాడులు చేసి పాక్​లోని పలు ఎయిర్​బేస్​లను ధ్వంసం చేసింది.

    READ ALSO  Dirham | దిర్హామ్‌తో పోల్చితే రూ.23.5కి పడిపోయిన రూపాయి విలువ.. ఉత్సాహంలో ప్రవాసీయులు

    Defence Ministry | అత్యాధునిక రక్షణ వ్యవస్థ కోసం..

    శత్రు దేశాల విమానాలు, క్షిపణులు, యుద్ధ విమానాలను అడ్డుకోవడానికి భారత్(Bharath)​ ప్రస్తుతం రష్యా నుంచి కొనుగోలు చేసిన ఎస్​–400 వ్యవస్థను వినియోగిస్తుంది. రష్యా ఇప్పటికే మూడు యూనిట్లు భారత్​కు సరఫరా చేయగా మరో రెండు యూనిట్లు ఏడాదిలోగా డెలివరీ ఇవ్వనుంది. అయితే భారత్​ గగనతల రక్షణ వ్యవస్థను పటిష్టం చేసుకోవాలని భావిస్తోంది. ఇజ్రాయెల్​ ఐరన్​ డోమ్​ తరహాలో రక్షణ వ్యవస్థ ఉండాలని భావిస్తోంది. ఈ క్రమంలో ఇటీవల డ్రోన్ల నుంచి రక్షణ కోసం భార్గవాస్త్ర(Bhargavastra) పేరుతో చేపట్టిన ప్రయోగాలు విజయవంతం అయ్యాయి. దీంతో మరిన్ని పరిశోధనలు, ప్రయోగాలు, అత్యవసర ఆయుధాల కోసం రూ.50 వేల కోట్లు రక్షణ శాఖకు కేంద్రం అందించనున్నట్లు తెలిసింది.

    Latest articles

    Uttar Pradesh | మ‌హిళ‌తో కలిసి బైక్​పై రిస్కీ స్టంట్స్.. వీడియో వైరల్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Uttar Pradesh | ఇటీవ‌లి కాలంలో రోజురోజుకూ బరితెగించేస్తున్నారు. సమాజమే సిగ్గుతో తలదించుకునేలా వారు చేస్తున్న...

    Mahaa News | మ‌హా న్యూస్ ఛానెల్‌పై దాడి.. ఖండించిన చంద్ర‌బాబు, ప‌వ‌న్ , లోకేష్‌, బండి సంజ‌య్

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Mahaa News | హైదరాబాద్ నగరంలోని మహా న్యూస్ ఛానెల్ (Maha News) ప్రధాన కార్యాలయంపై...

    Himachal | భారీ వర్షాలతో వణికిపోతున్న హిమాచల్​ ప్రదేశ్​.. వరదలకు 31 మంది మృతి

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Himachal : ఉత్తరాది రాష్ట్రాల్లో వరణుడు కుమ్మేస్తున్నాడు. కుండపోత వానలతో అల్లాడిస్తున్నాడు. హిమాచల్ ప్రదేశ్‌(Himachal Pradesh)లో...

    Turmeric Board | పసుపు రైతులకు పండుగే..

    అక్షరటుడే, ఇందూరు : Turmeric Board | పసుపు రైతుల దశాబ్దాల కళ నెరవేరడమే కాకుండా ఇందూరు కేంద్రంగా...

    More like this

    Uttar Pradesh | మ‌హిళ‌తో కలిసి బైక్​పై రిస్కీ స్టంట్స్.. వీడియో వైరల్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Uttar Pradesh | ఇటీవ‌లి కాలంలో రోజురోజుకూ బరితెగించేస్తున్నారు. సమాజమే సిగ్గుతో తలదించుకునేలా వారు చేస్తున్న...

    Mahaa News | మ‌హా న్యూస్ ఛానెల్‌పై దాడి.. ఖండించిన చంద్ర‌బాబు, ప‌వ‌న్ , లోకేష్‌, బండి సంజ‌య్

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Mahaa News | హైదరాబాద్ నగరంలోని మహా న్యూస్ ఛానెల్ (Maha News) ప్రధాన కార్యాలయంపై...

    Himachal | భారీ వర్షాలతో వణికిపోతున్న హిమాచల్​ ప్రదేశ్​.. వరదలకు 31 మంది మృతి

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Himachal : ఉత్తరాది రాష్ట్రాల్లో వరణుడు కుమ్మేస్తున్నాడు. కుండపోత వానలతో అల్లాడిస్తున్నాడు. హిమాచల్ ప్రదేశ్‌(Himachal Pradesh)లో...