అక్షరటుడే, వెబ్డెస్క్ : Jaishankar | భారత్–పాకిస్తాన్ ఉద్రిక్తతల (india – pakistan tension) వేళ అఫ్గానిస్తాన్లోని తాలిబన్ ప్రభుత్వంతో (afghanistan taliban governament ) భారత్ చర్చలు జరిపింది. అఫ్తానిస్తాన్ తాత్కాలిక విదేశాంగ మంత్రి అమిర్ఖాన్ ముత్తాఖీతో (foreign minister aamir khan muttahida) భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ (external affairs minister jaishankar) ఫోన్లో మాట్లాడారు. జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్ పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. అనంతరం భారత్ ఆపరేషన్ సిందూర్తో (operation sindoor) పాక్లోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. తాలిబన్ ప్రభుత్వం (taliban governament) పహల్గామ్ ఉగ్రదాడిని (pahalgam terror attack) ఖండించింది. అంతేగాకుండా భారత్–పాకిస్తాన్ ఉద్రిక్తతల సమయంలో భారత్కు అనుకూలంగా మాట్లాడింది. ఈ క్రమంలో తాలిబన్ ప్రభుత్వం విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ చర్చలు జరపడం గమనార్హం.
అఫ్గానిస్తాన్ మంత్రితో (afghanistan minister) జరిగిన చర్చలపై జైశంకర్ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. అఫ్గాన్ తాత్కాలిక విదేశాంగ మంత్రితో చర్చించినట్లు ఆయన తెలిపారు. పహల్గామ్ ఉగ్రదాడిని (pahalgam terror attack) తాలిబన్ ప్రభుత్వం ఖండించడం హర్షణీయమని ఆయన పేర్కొన్నారు. అఫ్గాన్ ప్రజలతో స్నేహబంధాన్ని కొనసాగిస్తామని, వారి అభివృద్ధికి మద్దతు అందిస్తామని మంత్రి పేర్కొన్నారు.
Jaishankar | పాకిస్తాన్ తప్పుడు ప్రచారం
పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ ఆపరేషన్ సిందూర్ (operation sindoor) చేపట్టి పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలు (pakistan terror camps) ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. అనంతరం రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ క్రమంలో భారత్ ప్రయోగించిన ఓ క్షిపణి (missile) అఫ్గాన్ భూభాగంలో పడినట్లు పాకిస్తాన్ తప్పుడు ప్రచారం చేసింది. అయితే ఈ విషయాన్ని తాలిబన్ ప్రభుత్వం ఖండించింది. తమకు ఎలాంటి హాని జరగలేదని తాలిబన్ రక్షణశాఖ ప్రతినిధి (daliban defense spokesman) వెల్లడించారు. ఈ క్రమంలో విదేశాంగ మంత్రి జైశంకర్ అఫ్గాన్ మంత్రితో ఫోన్లో మాట్లాడారు.