అక్షరటుడే, వెబ్డెస్క్: Indian military | పాకిస్తాన్తో (pakistan) ఉద్రిక్తతల నేపథ్యంలో భారత సైన్యం (indianarmy) అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఎప్పుడు, ఎక్కడ నుంచి ఎదురయ్యే ప్రమాదాలను ఎలా ఎదుర్కోవాలో బలగాలను సన్నద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే పశ్చిమబెంగాల్లోని (west bengal) తీస్తా ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో గురువారం భారత సైన్యం తీస్తా ప్రహార్ పేరిట పెద్ద ఎత్తున సైనిక విన్యాసాలు నిర్వహించింది. నదీతీరంలో యుద్ధం సంభవిస్తే ఎలా ఎదుర్కోవాలి? శత్రువు వ్యూహాలను ఎలా తిప్పికొట్టాలన్న దానిపై కసరత్తు చేసింది. ఆయుధ సరఫరా, సైనికుల మధ్య సమన్వయం, కార్యాచరణ సంసిద్ధతతను క్షేత్ర స్థాయిలో పరీక్షించింది. ‘తీస్తా ప్రహార్’ సైనిక విన్యాసాలను గౌహతిలోని డిఫెన్స్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీస్ ‘X’లో షేర్ చేసింది, ‘తీస్తా ప్రహార్’ (Teesta Prahar) విన్యాసాలు ఉమ్మడి పోరాట సినర్జీ, సవాళ్లతో కూడిన నదీతీర భూభాగాల్లో సంసిద్ధతను ప్రదర్శించిందని రక్షణ శాఖ తెలిపింది.
ఈ విన్యాసాల్లో భారత సైన్యం “ఆధునిక ఆయుధాలు (modern weapons), వ్యూహాత్మక కసరత్తులు, వేగవంతమైన కార్యకలాపాలను ధ్రువీకరించింది, ఇది శ్రేష్ఠత, ఆధునీకరణకు దాని నిబద్ధతను ప్రతిబింబిస్తుందని” అని పేర్కొంది. భారత సైన్యంలోకి ఇటీవల అత్యాధునిక సాంకేతిక వ్యవస్థలు, ఆయుధాలు వచ్చి చేరాయి. ఈ క్రమంలో వాటిని వినియోగించడం, సాంకేతికంగా ఎదురయ్యే సమస్యలు, దళాల మధ్య సమన్వయంపై ఈ విన్యాసాల్లో (visa) ప్రధానంగా దృష్టి సారించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఎదురైనప్పుడు ఎలా వ్యవహరించాలన్న దానిపై కసరత్తు చేశారు. ప్రతికూల పరిస్థితుల్లో వేగంగా, సమర్థవంతంగా లక్ష్యాలు ఛేదించడంపై దృష్టి పెట్టారు. శత్రువుల నుంచి పొంచి ఉన్న ప్రమాదాన్ని పసిగట్టి అప్పటికప్పుడు ఎలా వ్యవహరించాలన్న దానిపై బలగాలకు అవగాహన కల్పించారు. కొత్తగా అందుబాటులోకి వచ్చిన నెక్ట్స్ జనరేషన్ ఆయుధ వ్యవస్థలు (next-generation weapon systems), అధునాతన టెక్నాలజీ వినియోగంపై కసరత్తు చేశారు.
జమ్మూ & కశ్మీర్లోని (jammu and kashmir) పహల్గామ్లో ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఉగ్రవాదులు (terrorists) 26 మందిని చంపినందుకు ప్రతీకారంగా పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత-కశ్మీర్లోని తొమ్మిది ప్రదేశాలలో ఉగ్రవాద మౌలిక సదుపాయాలను నాశనం చేయడానికి మే 7న ప్రారంభించబడిన ఆపరేషన్ సిందూర్ (operation sindoor) నేపథ్యంలో ఈ పరిణామాలు వచ్చాయి. ఉగ్రవాద స్థావరాలపై (terrorist camps) దాడి పాక్ దాడులకు దారితీసింది, వీటిని భారత సాయుధ దళాలు (indian armed forces) విజయవంతంగా తిప్పికొట్టాయి. ప్రతీకారంగా, భారతదేశం మే 10 తెల్లవారుజాము వరకు పాకిస్తాన్లోని (pakistan) సైనిక స్థావరాలపై దాడులు చేసింది. అదే రోజు సాయంత్రం, భూమి, వాయు, సముద్రంపై జరిగే అన్ని కాల్పులు, సైనిక చర్యలను తక్షణమే నిలిపివేయాలని రెండు దేశాల మధ్య ఒక అవగాహన కుదిరింది.