అక్షరటుడే, వెబ్డెస్క్ : Operation Kagar | తెలంగాణ – ఛత్తీస్గఢ్ సరిహద్దులో Telangana-Chhattisgarh border ములుగు జిల్లా వెంకటాపూర్ సమీపంలో గల కర్రెగుట్టల్లో karreguttalu ఆపరేషన్ కగార్ operation kagar ముగిసినట్లు అధికారులు వెల్లడించారు. కర్రెగుట్టల్లో దాదాపు వెయ్యి మంది మావోయిస్టులు ఉన్నారనే సమాచారం మేరకు వేల సంఖ్యల్లో బలగాలు చుట్టు ముట్టాయి. 21 రోజుల పాటు సాగిన కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించాయి.
Operation Kagar | భద్రతా బలగాల విజయం
క్లిష్టమైన వాతావరణ పరిస్థితులు ఉన్న కర్రెగుట్టల్లో సవాళ్ల నడుమ భద్రతా బలగాలు security forces ఆపరేషన్ చేపట్టాయి. ఈ ఆపరేషన్లో బలగాలు భారీ విజయాన్ని సాధించాయి. కూంబింగ్లో భాగంగా జరిగిన ఎన్కౌంటర్లలో encounters 31 మంది మావోయిస్టులు మృతి చెందారు. మరోవైపు 18 మంది జవాన్లకు గాయాలు అయ్యాయి. ఒక ల్యాండ్మైన్ పేలి ముగ్గురు జవాన్లు మృతి చెందారు. ఇందులో తెలంగాణలోని కామారెడ్డి kamareddy జిల్లా పాల్వంచకు చెందిన గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ వడ్ల శ్రీధర్ కూడా ఉన్నారు. మరోవైపు ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టులపై మొత్తం రూ.1.72 కోట్ల రివార్డ్ ఉంది.
Operation Kagar | భారీగా ఆయుధాలు స్వాధీనం
కర్రెగుట్టల్లో చేపట్టిన ఆపరేషన్లో భద్రత బలగాలు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. 214 మావోయిస్టు డంప్లను గుర్తించారు. 35 రైఫిల్స్, 450 ఐఈడీలు, డిటోనేటర్లు, ఇండెక్స్ వైర్ల బండిల్స్, బుల్లెట్లు, ఫ్యూజ్ వైర్లు, ఇతర సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల బంకర్లను ధ్వంసం చేశారు.
Operation Kagar | చిక్కని ‘హిడ్మా’
మావోయిస్టు కీలక నేత హిడ్మాతో hidma పాటు ఆయన దళ సభ్యులు కర్రెగుట్టల్లో ఉన్నట్లు ప్రచారం జరిగింది. వారి లక్ష్యంగానే ఆపరేషన్ చేపట్టినట్లు సమాచారం. అయితే మోస్ట్వాంటెండ్ హిడ్మా మాత్రం బలగాలకు చిక్కలేదు. ఆపరేషన్ ప్రారంభం కాగానే నక్సల్స్ naxals బంకర్లను ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లినట్లు బలగాలు గుర్తించాయి. పలు మావోయిస్టుల బంకర్లను జవాన్లు ధ్వంసం చేశారు. మరోవైపు తాము చర్చలకు సిద్ధమని, ఆపరేషన్ కగార్ ఆపాలని మావోలు లేఖ విడుదల చేసిన విషయం తెలిసిందే. మావోలు లేఖ విడుదల చేసిన రోజు కర్రెగుట్టల్లో ఆపరేషన్ ముగిసినట్లు అధికారులు ప్రకటించారు.