అక్షరటుడే, వెబ్డెస్క్ :Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు(Domestic stock markets) బుధవారం లాభాలతో కొనసాగుతున్నాయి. ఉదయం 130 పాయింట్ల స్వల్ప లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్(Sensex).. ఇంట్రాడేలో గరిష్టంగా 543 పాయింట్లు లాభపడింది. 35 పాయింట్ల లాభంతో ప్రారంభమైన నిఫ్టీ గరిష్టంగా 189 పాయింట్లు పెరిగింది. మెటల్(Matal), రియాలిటీ, ఐటీ స్టాక్స్ రాణిస్తుండడంతో సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఉదయం 11.15 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 334 పాయింట్ల లాభంతో 81,482 వద్ద, నిఫ్టీ(Nifty) 128 పాయింట్ల లాభంతో 24,707 వద్ద కొనసాగుతున్నాయి. బీఎస్ఈ(BSE)లో 2,682 కంపెనీలు లాభాలతో ఉండగా.. 921 కంపెనీలు నష్టపోతున్న జాబితాలో ఉన్నాయి. 178 కంపెనీలు ఫ్లాట్గా కొనసాగుతున్నాయి.
Stock Market | అన్ని సెక్టార్లలో ర్యాలీ..
అన్ని రంగాల షేర్లు పాజిటివ్ గా కొనసాగుతున్నాయి. మెటల్ ఇండెక్స్ 2.19 శాతం పెరగ్గా.. పీఎస్కూ, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు 1.3 శాతం మేర లాభాలతో కొనసాగుతున్నాయి. ఐటీ(IT), ఎనర్జీ, ఇన్ఫ్రా ఇండెక్స్లు ఒక శాతానికిపైగా లాభంతో ఉన్నాయి. పీఎస్యూ బ్యాంక్, ఆటో, పవర్ సెక్టార్లలో కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. స్మాల్ క్యాప్ ఇండెక్స్(Small cap index) 1.2 శాతం లాభంతో, మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.87 శాతం లాభంతో కొనసాగుతున్నాయి. లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.5 శాతం లాభంతో ఉంది.
Top Gainers..
బీఎస్ఈ సెన్సెక్స్ 30 ఇండెక్స్లో 22 కంపెనీలు లాభాలతో సాగుతుండగా.. 8 కంపెనీలు నష్టాలతో ఉన్నాయి. టాటా స్టీల్(Tata steel) 4.31 శాతం లాభాలతో ఉంది. ఎటర్నల్, టెక్ మహీంద్రా, ఎంఅండ్ఎం, ఇన్ఫోసిస్ ఒక శాతానికిపైగా లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి.
Top Losers..
ఆసియా పెయింట(Asia paint) 1.34 శాతం నష్టపోగా.. టాటా మోటార్స్, హెచ్యూఎల్, కొటక్ బ్యాంక్, నెస్లే నష్టాలతో కదలాడుతున్నాయి.