అక్షరటుడే, వెబ్డెస్క్:Rain Alert | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బుధవారం వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ(Meteorological Department) అధికారులు తెలిపారు. దక్షిణ తెలంగాణలో సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. హైదరాబాద్(Hyderabad)లోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు పడొచ్చని తెలిపారు. గత రెండు, మూడు రోజులుగా పలు జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు వాతావరణం పొడిగా ఉంటుంది. ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో పాటు ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సాయంత్రం కాగానే ఒక్కసారిగా మేఘాలు కమ్ముకుని వర్షం కురుస్తోంది.
Rain Alert | అర్ధరాత్రి భారీ వర్షం
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం అర్ధరాత్రి భారీ వర్షం(Heavy rain) కురిసింది. ఈదురుగాలులతో కూడిన వాన పడటంతో పలు చోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు నెలకొరిగాయి. కొన్ని గ్రామాల్లో రాత్రంతా కరెంట్ లేక ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కామారెడ్డి, మెదక్, నిజామాబాద్, ములుగు, సిద్దిపేట, సిరిసిల్లలో వర్షం కురిసింది.
తడిసి ముద్ధయిన ధాన్యం అకాల వర్షంతో అన్నదాతలు అనేక అవస్థలు పడుతున్నారు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షం నుంచి ధాన్యాన్ని కాపాడుకోవడానికి కంటి మీద కునుకు లేకుండా కుప్పల వద్ద కాపలా ఉంటున్నారు. ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతుండడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. చేతికొచ్చిన పంట వర్షానికి తడిసిపోతుండడంతో ఆందోళన చెందుతున్నారు. వేగంగా ధాన్యం కొనుగోలు చేపట్టాలని కోరుతున్నారు.