అక్షరటుడే, న్యూఢిల్లీ: Pakistani High Commission : పాకిస్తాన్ హైకమిషన్ ఉద్యోగి రెహమాన్పై భారత్ వేటు వేసింది. రాయబార కార్యాలయంలో ఉండే అర్హతలేని వ్యక్తిగా ప్రకటించింది. 24 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని భారత్ ఆదేశాలు జారీ చేసింది. పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ కోసం రెహమాన్ పని చేస్తున్నట్లు భారత్ గుర్తించింది.
రాయబార కార్యాలయ ఉద్యోగి ముసుగులో రెహమాన్ గూఢచర్యం చేస్తున్నాడు. భారత సైన్యం సమాచారాన్ని ISIకి రెహమాన్చేరవేస్తున్నాడు. డానిష్ మారుపేరుతో ISI కోసం రెహమాన్ పనిచేస్తున్నట్లు నిర్ధారణ కావడంతో భారత్ చర్యలు తీసుకొంది.