More
    HomeజాతీయంMonsoon | చల్లని కబురు.. ముందుగానే ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు.. ఈసారి భారీగానే వర్షాలు

    Monsoon | చల్లని కబురు.. ముందుగానే ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు.. ఈసారి భారీగానే వర్షాలు

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Monsoon | గత రెండు నెలలుగా భానుడి ప్రతాపంతో అల్లాడుతున్న దేశ ప్రజలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) చల్లని తీపి కబురు అందించింది. ఈసారి నైరుతి రుతుపవనాలు ముందుగానే దేశంలోకి ప్రవేశించినట్లు ప్రకటించింది.

    దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవులు, దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలను మంగళవారం మధ్యాహ్నం నాటికి నైరుతి రుతుపవనాలు తాకినట్లు ఐఎండీ వెల్లడించింది. నైరుతి రుతుపవనాల రాకతో అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని పేర్కొంది.

    రానున్న మూడు, నాలుగు రోజుల్లో అండమాన్‌ నికోబార్‌ దీవులతో పాటు దక్షిణ అరేబియా సముద్రం, బంగాళాఖాతం మధ్య వరకు రుతుపవనాలు విస్తరించనున్నట్లు ఐఎండీ తెలిపింది. మే 27 నాటికి నైరుతి రుతుపవనాలు కేరళను తాకే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది.

    READ ALSO  Rain Alert | నేటి నుంచి ఐదు రోజుల పాటు భారీ వ‌ర్షాలు

    Monsoon | 2009 తర్వాత ఇదే మొదటిసారి..

    సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్‌ 1 నాటికి భారత్​లోకి ప్రవేశిస్తాయి. ఈసారి మాత్రం అంతకంటే ముందుగానే కేరళను తాకే అవకాశాలు ఉన్నాయని ఐఎండీ ఇటీవల పేర్కొంది. అదే జరిగితే 2009 తర్వాత రుతుపవనాలు అంచనాల కంటే ముందుగా రావడం ఇదే మొదటిసారి కావడం విశేషం. 2009లో మే 23నే నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. మరోవైపు ఈసారి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

    మన దేశంలోని సాగుభూమిలో 52 శాతం వర్షాధారంగా రైతులు పంటలు పండిస్తారు. మొత్తం వ్యవసాయ ఉత్పత్తిలో ఈ సాగు భూమి నుంచే ఏకంగా 40% దిగుబడి ఉంటుంది. అందుకే భారత ఆహార భద్రత, ఆర్థిక స్థిరత్వంలో ఈ నైరుతి రుతు పవనాలు కీలక పాత్ర పోషిస్తాయంటారు. దేశవ్యాప్తంగా తాగునీరు, విద్యుత్తు ఉత్పత్తికి ముఖ్యమైన జలాశయాలను తిరిగి నింపడానికి ఈ రుతు పవనాలే ఆధారంగా చెప్పొచ్చు. దేశ జీడీపీ తోడ్పాటుకు కూడా ఇవి ఎంతో కీలకం.

    READ ALSO  Navi Mumbai Airport | ఎయిర్‌పోర్ట్‌లో కొత్తగా యూజర్ డెవలప్‌మెంట్ ఫీ..

    Latest articles

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ – 27 జూన్​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంవిక్రమ సంవత్సరం – 2081 పింగళఉత్తరాయణంగ్రీష్మ రుతువురోజు – శుక్రవారంమాసం – ఆషాఢపక్షం...

    Govt Employees | ఉద్యోగుల బదిలీలపై నిషేధం.. కారణం ఇదే..!

    అక్షరటుడే, హైదరాబాద్: Govt Employees : తెలంగాణ ప్రభుత్వం(Telangana state government) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల...

    Puri Jagannath Rath Yatra | తరిద్దాం శ్రీ కృష్ణుడి సేవలో.. నేడు పూరి జగన్నాథ రథయాత్ర

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Puri Jagannath Rath Yatra : శ్రీకృష్ణుడు(Sri Krishna) తన తోబుట్టువులతో కలిసి కొలువుదీరిన మహిమాన్విత...

    Vijay Deverakonda | సక్సెస్, డబ్బు, రెస్పెక్ట్.. ఈ మూడే కిక్ ఇచ్చేవి : విజయ్ దేవరకొండ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Vijay Deverakonda : జీవితంలో ప్రతి ఒక్కరికీ కిక్ ఇచ్చేవి సక్సెస్, మనీ, రెస్పెక్ట్ మాత్రమేనని...

    More like this

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ – 27 జూన్​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంవిక్రమ సంవత్సరం – 2081 పింగళఉత్తరాయణంగ్రీష్మ రుతువురోజు – శుక్రవారంమాసం – ఆషాఢపక్షం...

    Govt Employees | ఉద్యోగుల బదిలీలపై నిషేధం.. కారణం ఇదే..!

    అక్షరటుడే, హైదరాబాద్: Govt Employees : తెలంగాణ ప్రభుత్వం(Telangana state government) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల...

    Puri Jagannath Rath Yatra | తరిద్దాం శ్రీ కృష్ణుడి సేవలో.. నేడు పూరి జగన్నాథ రథయాత్ర

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Puri Jagannath Rath Yatra : శ్రీకృష్ణుడు(Sri Krishna) తన తోబుట్టువులతో కలిసి కొలువుదీరిన మహిమాన్విత...