అక్షరటుడే, వెబ్డెస్క్ : Adampur Air Base | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ pm modi పాకిస్తాన్కు మరోసారి మాస్ వార్నింగ్ ఇచ్చారు. భారత్ వైపు కన్నెత్తి చూస్తే జరిగిదే వినాశనమే అని ఆయన హెచ్చరించారు. పంజాబ్లోని ఆదంపూర్ ఎయిర్బేస్ Adampur Air Base ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఎయిర్ఫోర్స్ స్టేషన్లో జవాన్లను ఉద్దేశించి మోదీ మాట్లాడారు. ‘‘మీరందరూ ప్రతీ భారతీయుడు ఉప్పొంగేలా చేశారు.. దేశం అంతా మీ వెంట ఉంది. మీరందరూ చరిత్ర సృష్టించారు. మీ దర్శనం కోసం నేను వచ్చనని’’ మోదీ పేర్కొన్నారు. భారత వాయుసేన ప్రతిభను చూసి ప్రపంచం ఆశ్చర్యపోయిందని కొనియాడారు.
Adampur Air Base | ఇంట్లోకి చొచ్చుకెళ్లి దాడి చేశాం
ఉగ్రవాదులు పిరికిపందల్లా దాక్కొని వచ్చి అమాయకులపై దాడి చేశారని మోదీ అన్నారు. ఉగ్రవాదులకు బుద్ధి చెప్పడానికి ఆపరేషన్ సిందూర్ operation sindoor చేపట్టినట్లు పేర్కొన్నారు. 15 నిమిషాల్లోనే సరిహద్దు అవతల ఉన్న లక్ష్యాలను ధ్వంసం చేశామన్నారు. పాక్ డీలా పడిపోయిందని, ఎప్పుడు దాడి జరిగిందో కూడా కనిపెట్టలేక పోయిందన్నారు. మన ఆడబిడ్డల సిందూరం దూరం చేసిన వారి ఇంట్లోకి చొచ్చుకెళ్లి దాడులు చేశామన్నారు. త్రివిధ దళాలకు చెందిన సైనికులకు ఆయన సెల్యూట్ చేశారు.
Adampur Air Base | పాక్ ఆయుధాలు తేలిపోయాయి..
మనం ఉగ్రవాదులపై దాడులు చేస్తే పాకిస్తాన్ ప్రజలు, మిలటరీ స్థావరాలపై దాడులకు యత్నించిందని మోదీ పేర్కొన్నారు. వందల సంఖ్యలో డ్రోన్లు, మిసైళ్లు, యూఏవీలతో దాడులకు పాల్పడిందన్నారు. అయితే మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వాటిని అడ్డుకుందని తెలిపారు. మన రక్షణ వ్యవస్థ ముందు పాక్ ఆయుధాలు తేలిపోయాయని ఎద్దేవా చేశారు. అదే సమయంలో మన మిసైళ్లు పాక్లోని లక్ష్యాలను ఛేదించాయని తెలిపారు. ఈ ఆపరేషన్ సమయంలో త్రివిధ దళాలు సమన్వయంతో పనిచేశాయని మోదీ అభినందించారు.
Adampur Air Base | వారి తరహాలోనే జవాబు
ఆపరేషన్ సిందూర్ సాధారణమైన సైనిక విన్యాసం కాదని, ఇది భారతదేశ నీతి, నియమం, నిర్ణయానికి నిదర్శనమని మోదీ అభివర్ణించారు. ఉగ్రదాడులు చేసే వారికి, వారి తరహాలోనే జవాబు ఇస్తామన్నారు. అణ్వాయుధాల పేరిట బ్లాక్మెయిల్ చేస్తే చూస్తూ ఊరుకోమన్నారు. ఉగ్రవాదులను, ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించే వారిని ఒకేలాగా చూస్తామని మోదీ స్పష్టం చేశారు. మన సామర్థ్యం చూసి పాకిస్తాన్కు కొన్ని రోజులు నిద్ర పట్టదని మోదీ అన్నారు.