అక్షరటుడే, వెబ్డెస్క్ : Adampur Air Base | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం పంజాబ్లో పర్యటించారు. పంజాబ్లోని ఆదంపూర్ ఎయిర్బేస్ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా సైనికులతో మాట్లాడారు. ‘‘ఆదంపూర్లో వైమానిక యోధులు, సైనికులను కలిశా.. ధైర్యం, దృఢ సంకల్పానికి సైనికులు ప్రతిరూపం.. దేశం కోసం మన సాయుధ దళాల చేస్తున్న సాహసానికి భారతదేశం ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటుంది’ అని మోదీ పేర్కొన్నారు.
Adampur Air Base | ఫేక్ ప్రచారాన్ని తిప్పికొట్టిన మోదీ
పహల్గామ్ ఉగ్రదాడి(Pahalgam terror attack) తర్వాత భారత్ ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) నిర్వహించి పాకిస్తాన్లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. దీంతో పాకిస్తాన్ ప్రతీకారదాడులకు దిగింది. భారత పౌరులు, ఎయిర్బేస్లు, మిలటరీ స్థావరాలే లక్ష్యంగా డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేసింది. భారత రక్షణ వ్యవస్థ పాక్ దాడులను తిప్పి కొట్టింది. అయితే పాకిస్తాన్ మాత్రం తాము భారత్ ఎయిర్బేస్లను ధ్వంసం చేశామని తప్పుడు ప్రచారం చేసింది. ఆదంపూర్ ఎయిర్బేస్(Adampur Air Base)పై దాడి చేశామని దాయాది దేశం అబద్దాలు చెప్పింది. అయితే ఆ ఫేక్ ప్రచారాన్ని తిప్పి కొట్టడానికి మోదీ ఆదంపూర్ ఎయిర్బేస్(Adampur Air Base)లో పర్యటించారు. అక్కడ సైనికులతో మాట్లాడి ఫొటోలు దిగారు.
Adampur Air Base | పాక్కు హెచ్చరిక
ప్రధాని మోదీ సోమవారం రాత్రి పాకిస్తాన్కు వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. జాతినుద్దేశించి మాట్లాడిన ఆయన ఉగ్రదాడులకు పాల్పడితే పాక్పై మరిన్ని దాడులు చేస్తామని హెచ్చరించారు. పాక్కు సింధూ జలాలు ఇచ్చేది లేదని, ఆ దేశంతో వాణిజ్యం విషయంలో చర్చలు ఉండవని స్పష్టం చేశారు. పీవోకే, ఉగ్రవాదం విషయంలో మాత్రమే పాక్ చర్చలు ఉంటాయన్నారు. అణ్వాయుధాల పేరిట బ్లాక్మెయిల్ చేస్తే చూస్తూ ఊరుకోమని మోదీ పాక్ను హెచ్చరించిన విషయం తెలిసిందే. అలాగే ఆపరేషన్ సిందూర్ నిలిపివేశామని, పాక్ చర్యలను బట్టి తమ ప్రతిస్పందన ఉంటుందని మోదీ పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆయన పంజాబ్లోని ఎయిర్బేస్ సందర్శించడం ప్రాధాన్యత సంతరించుకుంది.