More
    HomeజాతీయంAdampur Air Base | ఆదంపూర్‌ ఎయిర్‌బేస్‌ను సందర్శించిన మోదీ

    Adampur Air Base | ఆదంపూర్‌ ఎయిర్‌బేస్‌ను సందర్శించిన మోదీ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Adampur Air Base | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం పంజాబ్​లో పర్యటించారు. పంజాబ్​లోని ఆదంపూర్‌ ఎయిర్‌బేస్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా సైనికులతో మాట్లాడారు. ‘‘ఆదంపూర్‌లో వైమానిక యోధులు, సైనికులను కలిశా.. ధైర్యం, దృఢ సంకల్పానికి సైనికులు ప్రతిరూపం.. దేశం కోసం మన సాయుధ దళాల చేస్తున్న సాహసానికి భారతదేశం ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటుంది’ అని మోదీ పేర్కొన్నారు.

    Adampur Air Base | ఫేక్​ ప్రచారాన్ని తిప్పికొట్టిన మోదీ

    పహల్​గామ్​​ ఉగ్రదాడి(Pahalgam terror attack) తర్వాత భారత్​ ఆపరేషన్​ సిందూర్​(Operation Sindoor) నిర్వహించి పాకిస్తాన్​లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. దీంతో పాకిస్తాన్​ ప్రతీకారదాడులకు దిగింది. భారత పౌరులు, ఎయిర్​బేస్​లు, మిలటరీ స్థావరాలే లక్ష్యంగా డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేసింది. భారత రక్షణ వ్యవస్థ పాక్​ దాడులను తిప్పి కొట్టింది. అయితే పాకిస్తాన్​ మాత్రం తాము భారత్​ ఎయిర్​బేస్​లను ధ్వంసం చేశామని తప్పుడు ప్రచారం చేసింది. ఆదంపూర్​ ఎయిర్​బేస్​(Adampur Air Base)పై దాడి చేశామని దాయాది దేశం అబద్దాలు చెప్పింది. అయితే ఆ ఫేక్​ ప్రచారాన్ని తిప్పి కొట్టడానికి మోదీ ఆదంపూర్​ ఎయిర్​బేస్​(Adampur Air Base)లో పర్యటించారు. అక్కడ సైనికులతో మాట్లాడి ఫొటోలు దిగారు.

    READ ALSO  Plane crash | నేడు గుజరాత్​కు ప్రధాని నరేంద్ర మోదీ

    Adampur Air Base | పాక్​కు హెచ్చరిక

    ప్రధాని మోదీ సోమవారం రాత్రి పాకిస్తాన్​కు​ వార్నింగ్​ ఇచ్చిన విషయం తెలిసిందే. జాతినుద్దేశించి మాట్లాడిన ఆయన ఉగ్రదాడులకు పాల్పడితే పాక్​పై మరిన్ని దాడులు చేస్తామని హెచ్చరించారు. పాక్​కు సింధూ జలాలు ఇచ్చేది లేదని, ఆ దేశంతో వాణిజ్యం విషయంలో చర్చలు ఉండవని స్పష్టం చేశారు. పీవోకే, ఉగ్రవాదం విషయంలో మాత్రమే పాక్​ చర్చలు ఉంటాయన్నారు. అణ్వాయుధాల పేరిట బ్లాక్​మెయిల్​ చేస్తే చూస్తూ ఊరుకోమని మోదీ పాక్​ను హెచ్చరించిన విషయం తెలిసిందే. అలాగే ఆపరేషన్​ సిందూర్​ నిలిపివేశామని, పాక్​ చర్యలను బట్టి తమ ప్రతిస్పందన ఉంటుందని మోదీ పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆయన పంజాబ్​లోని ఎయిర్​బేస్​ సందర్శించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

    Latest articles

    MLC Kavitha | ప్రశ్నిస్తున్నారని కక్షగట్టిన సర్కారు.. కేసులతో వేధిస్తున్నారన్న కవిత

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :MLC Kavitha | అసెంబ్లీ ఎన్నికలకు ముందు రైతులకు, ప్రజలకి ఎన్నో హామీలిచ్చిన కాంగ్రెస్ పార్టీ...

    Nizamabad Collector | కలెక్టర్​ను కలిసిన నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం నాయకులు

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad Collector | జిల్లా కలెక్టర్​గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన వినయ్ కృష్ణారెడ్డిని జిల్లా నాలుగో...

    CP Sai Chaitanya | సీపీని కలిసిన బెటాలియన్​ కమాండెంట్

    అక్షరటుడే, డిచ్​పల్లి: CP Sai Chaitanya | డిచ్​పల్లి ఏడో బెటాలియన్​ కమాండెంట్​ సత్యనారాయణ (7th Battalion Commandant...

    Raja Raghuvanshi | మేఘాల‌య హనీమూన్ జంట విషాదంలో కొత్త కోణం.. మూడు నెల‌ల ముందే హ‌త్య‌కు కుట్ర‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Raja Raghuvanshi | హనీమూన్‌ కోసం మేఘాలయ వెళ్లి అక్కడ హత్యకు గురైన ఇండోర్ వ్యాపారవేత్త...

    More like this

    MLC Kavitha | ప్రశ్నిస్తున్నారని కక్షగట్టిన సర్కారు.. కేసులతో వేధిస్తున్నారన్న కవిత

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :MLC Kavitha | అసెంబ్లీ ఎన్నికలకు ముందు రైతులకు, ప్రజలకి ఎన్నో హామీలిచ్చిన కాంగ్రెస్ పార్టీ...

    Nizamabad Collector | కలెక్టర్​ను కలిసిన నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం నాయకులు

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad Collector | జిల్లా కలెక్టర్​గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన వినయ్ కృష్ణారెడ్డిని జిల్లా నాలుగో...

    CP Sai Chaitanya | సీపీని కలిసిన బెటాలియన్​ కమాండెంట్

    అక్షరటుడే, డిచ్​పల్లి: CP Sai Chaitanya | డిచ్​పల్లి ఏడో బెటాలియన్​ కమాండెంట్​ సత్యనారాయణ (7th Battalion Commandant...