అక్షరటుడే, వెబ్డెస్క్: Anakapalle | మంచంపై నిద్రిస్తున్న భర్తపై భార్య మరుగుతున్న వేడి నూనె పోసిన ఘటన ఆంధ్రప్రదేశ్లోని Andhra Pradesh అనకాపల్లి జిల్లాలో Anakapalle district చోటుచేసుకుంది. ఈ ఘటన అనంతరం భార్య wife ఇంటి తలుపులు మూసి గోడ దూకి పారిపోయింది. ఇంటి యజమాని owner తలుపులు తీయడంతో భర్త husband ప్రాణాలతో బయటపడ్డాడు.
గుంటూరు జిల్లాకు Guntur district చెందిన బాలకృష్ణ.. రమణమ్మను వివాహం చేసుకుని కూర్మన్నపాలెంలో నివాసం ఉండేవారు. ఇటీవలే సాలాపువానిపాలెంలో అద్దె ఇంట్లోకి rented house మారారు. కాగా, రోజూ మద్యం తాగి వచ్చి తనని వేధిస్తున్నాడని harassing విసిగిపోయిన భార్య.. మంచంపై నిద్రిస్తున్న బాలకృష్ణపై మరుగుతున్న నూనె boiling oil పోసి, అనంతరం గోడ దూకి పారిపోయింది.
ఈ ఘటన ఈరోజు తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. బాధితుడిని అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి Anakapalle NTR Hospital తరలించి చికిత్స అందిస్తున్నారు. అతడికి 45% కాలిన గాయాలు అయినట్లు వైద్యులు తెలిపారు.
తన భార్య తనపై నూనె oil పోసినప్పుడు నొప్పితో కేకలు వేస్తే.. “నన్ను కొట్టినప్పుడు ఈ నొప్పి నీకు తెలియదా” అంటూ.. భార్య wife తనతో అందని బాధితుడు వాపోయాడు. కాగా, దాడికి పాల్పడ్డ భార్య గర్భిణీ అని తెలిసింది. పోలీసులు police దర్యాప్తు చేపట్టారు.