అక్షరటుడే, వెబ్డెస్క్ : PM Modi | పాకిస్తాన్ గుండెల్లో భారత సేనలు బాంబులు పేల్చాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ pm modi అన్నారు. సోమవారం రాత్రి ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. ఆపరేషన్ సిందూర్ operation sindoorతో దేశ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పామన్నారు. భారత సైనికులు, శాస్త్రవేత్తలకు ప్రధాని సెల్యూట్ చేశారు. మన వీర సైనికులు ఆపరేషన్ సిందూర్ లక్ష్యాల కోసం ధైర్యసాహసాలు ప్రదర్శించారన్నారు. ఉగ్రవాదులు, పాకిస్తాన్కు మన బలగాలు బుధ్ది చెప్పాయని తెలిపారు.
PM Modi | సైన్యానికి పూర్తి స్వేచ్ఛ
పహల్గామ్లో ఉగ్రవాదులు అమాయక పర్యాటకులను వారి కుటుంబ సభ్యుల సమక్షంలో చంపారన్నారు. వ్యక్తిగతంగా ఇది తనకు దారుణమైన విషయం అని మోదీ పేర్కొన్నారు. ఉగ్రదాడిని terror attack యావత్ దేశం ఖండించిదన్నారు. దీంతో ఉగ్రవాదులను అంతం చేయడానికి భారత సైన్యానికి తాము పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని ప్రధాని మోదీ తెలిపారు. ప్రస్తుతం భారత త్రివిధ దళాలు అప్రమత్తంగా ఉన్నాయని తెలిపారు. అటు నుంచి ఏదైనా దాడి జరిగితే ప్రతిస్పందన భారీ స్థాయిలో ఉంటుందని ఆయన హెచ్చరించారు.
PM Modi | ఆపరేషన్ సిందూర్ ఒక ఆవేదన
ఆపరేషన్ సిందూర్ పేరు కాదని, ఆవేదన అని మోదీ అన్నారు. దేశ మహిళల సిందూరం దూరం చేస్తే ఏం జరుగుతుందో చూపించామని పేర్కొన్నారు. నేషన్ ఫస్ట్ అనే నినాదంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆపరేషన్ సిందూర్లో 100 మందికిపైగా ఉగ్రవాదులు హతమయ్యారని చెప్పారు. ఉగ్రవాదులు దాడి చేస్తే ఇలాగే ప్రతిస్పందిస్తామని స్పష్టం చేశారు.
PM Modi | వారు కలలో కూడా ఊహించి ఉండరు..
భారత్ ఇంత పెద్ద ప్రతిదాడి చేస్తోందని ఉగ్రవాదులు కలలో కూడా ఊహించి ఉండరని మోదీ అన్నారు. భారత సేనలు పాకిస్తాన్లోకి వెళ్లి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశాయన్నారు. ఉగ్రవాద శిబిరాలపై భారత క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేశామన్నారు. పాక్ భారత్కు వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని పోషిస్తోందన్నారు. ప్రపంచ ఉగ్రవాదానికి మూలాలుగా మారిన బహవల్పూర్, మూరిద్ ప్రాంతాలను ధ్వంసం చేశామని మోదీ ప్రకటించారు. ఉగ్రవాదుల హెడ్క్వార్టర్స్ను నేలమట్టం చేశామని తెలిపారు. దీంతో కరుడుగట్టిన ఉగ్రవాదులు చనిపోయారని చెప్పారు. టెర్రరిస్టులు చనిపోవడంతో పాక్ మిలటరి అధికారులు కన్నీరు పెట్టుకున్నారని పేర్కొన్నారు.
PM Modi | పాక్కు బుద్ధి చెప్పాం
ఆపరేషన్ సిందూర్తో పాక్ నిరాశకు లోనయిందని ప్రధాని పేర్కొన్నారు. ఉగ్రవాదులను అంతం చేస్తే ఆ దేశం భారత ప్రజలు, ఆలయాలు, గురుద్వారాలపై దాడులకు యత్నించిందన్నారు. పాక్ దాడులను భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టం సమర్థవంతంగా అడ్డుకుందన్నారు. ఆ దేశం ప్రయోగించిన మిసైళ్లు మనల్ని తాకలేకపోయాయన్నారు. అయితే భారత సేనలు మాత్రం పాక్లోకి చొచ్చుకువెళ్లి మరీ దాడులు చేశాయని మోదీ తెలిపారు. భారత్పై మళ్లీ దాడి చేస్తే ముఖం పగిలే సమాధానం చెబుతామని స్పష్టం చేశారు.
PM Modi | పాక్ భయపడింది
డ్రోన్లు, మిసైళ్లతో పాక్ దాడులు చేయడంతో భారత్ ప్రతిదాడులు చేసినట్లు మోదీ తెలిపారు. ఆ దేశంలోని పలు కీలక ఎయిర్బేస్లపై బాంబులు వేశామన్నారు. దీంతో అవి తీవ్రంగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. ఒక్కదాడితోనే పాక్ భయపడిపోయిందని మోదీ అన్నారు. దీంతో ఆత్మరక్షణలో పాడిన పాక్ ప్రపంచ దేశాల సాయం కోరిందని మోదీ స్పష్టం చేశారు. చివరికి ఈ నెల 10వ తేదీన పాకిస్తాన్ భారత్ డీజీఎంవోను సంప్రదించిందన్నారు. దీంతో కాల్పుల విరమణకు అంగీకరించినట్లు తెలిపారు. ఉగ్రవాదులు దాడి చేస్తే ఇలాగే ప్రతిస్పందిస్తామని ఆయన స్పష్టం చేశారు.
PM Modi | బ్లాక్మెయిల్ను సహించం
పాకిస్తాన్ తమ వద్ద అణుబాంబులు ఉన్నాయని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తూ ఉగ్రదాడులకు పాల్పడితే సహించమని మోదీ హెచ్చరించారు. ఆపరేషన్ సిందూర్ను ప్రస్తుతం నిలిపివేశామని, పాక్ చర్యలను బట్టి ప్రతిస్పందన ఉంటుందని మోదీ తేల్చి చెప్పారు.
PM Modi | వాటిపైనే చర్చ
ఉగ్రవాదం– వాణిజ్యం, నీరు –రక్తం ఒక్కచోట ఉండలేవని మోదీ స్పష్టం చేశారు. పాకిస్తాన్తో చర్చలు ఉంటే ఉగ్రవాదం, పీవోకేపై మాత్రమే ఉంటాయన్నారు. మిగతా విషయాల్లో ఆ దేశంతో ఎలాంటి చర్చల ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. దీంతో పాక్తో వాణిజ్యం రద్దు, సింధూ నది జలాల ఒప్పందం రద్దు అలాగే ఉంటుందని ఆయన పేర్కొన్నారు.