More
    Homeఅంతర్జాతీయంPM Modi | పాక్​ గుండెల్లో బాంబులు పేల్చాం : ప్రధాని మోదీ

    PM Modi | పాక్​ గుండెల్లో బాంబులు పేల్చాం : ప్రధాని మోదీ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | పాకిస్తాన్​ గుండెల్లో భారత సేనలు బాంబులు పేల్చాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ pm modi అన్నారు. సోమవారం రాత్రి ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. ఆపరేషన్​ సిందూర్ operation sindoor​తో దేశ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పామన్నారు. భారత సైనికులు, శాస్త్రవేత్తలకు ప్రధాని సెల్యూట్​ చేశారు. మన వీర సైనికులు ఆపరేషన్​ సిందూర్​ లక్ష్యాల కోసం ధైర్యసాహసాలు ప్రదర్శించారన్నారు. ఉగ్రవాదులు, పాకిస్తాన్​కు మన బలగాలు బుధ్ది చెప్పాయని తెలిపారు.

    PM Modi | సైన్యానికి పూర్తి స్వేచ్ఛ

    పహల్​గామ్​లో ఉగ్రవాదులు అమాయక పర్యాటకులను వారి కుటుంబ సభ్యుల సమక్షంలో చంపారన్నారు. వ్యక్తిగతంగా ఇది తనకు దారుణమైన విషయం అని మోదీ పేర్కొన్నారు. ఉగ్రదాడిని terror attack యావత్​ దేశం ఖండించిదన్నారు. దీంతో ఉగ్రవాదులను అంతం చేయడానికి భారత సైన్యానికి తాము పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని ప్రధాని మోదీ తెలిపారు. ప్రస్తుతం భారత త్రివిధ దళాలు అప్రమత్తంగా ఉన్నాయని తెలిపారు. అటు నుంచి ఏదైనా దాడి జరిగితే ప్రతిస్పందన భారీ స్థాయిలో ఉంటుందని ఆయన హెచ్చరించారు.

    READ ALSO  Plane Crash | విమాన ప్రమాదం నేపథ్యంలో డీజీసీఏ కీలక నిర్ణయం

    PM Modi | ఆపరేషన్​ సిందూర్​ ఒక ఆవేదన

    ఆపరేషన్​ సిందూర్​ పేరు కాదని, ఆవేదన అని మోదీ అన్నారు. దేశ మహిళల సిందూరం దూరం చేస్తే ఏం జరుగుతుందో చూపించామని పేర్కొన్నారు. నేషన్​ ఫస్ట్​ అనే నినాదంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆపరేషన్​ సిందూర్​లో 100 మందికిపైగా ఉగ్రవాదులు హతమయ్యారని చెప్పారు. ఉగ్రవాదులు దాడి చేస్తే ఇలాగే ప్రతిస్పందిస్తామని స్పష్టం చేశారు.

    PM Modi | వారు కలలో కూడా ఊహించి ఉండరు..

    భారత్​ ఇంత పెద్ద ప్రతిదాడి చేస్తోందని ఉగ్రవాదులు కలలో కూడా ఊహించి ఉండరని మోదీ అన్నారు. భారత సేనలు పాకిస్తాన్​లోకి వెళ్లి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశాయన్నారు. ఉగ్రవాద శిబిరాలపై భారత క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేశామన్నారు. పాక్​ భారత్​కు వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని పోషిస్తోందన్నారు. ప్రపంచ ఉగ్రవాదానికి మూలాలుగా మారిన బహవల్​పూర్​, మూరిద్ ప్రాంతాలను ధ్వంసం చేశామని మోదీ ప్రకటించారు. ఉగ్రవాదుల హెడ్​క్వార్టర్స్​ను నేలమట్టం చేశామని తెలిపారు. దీంతో కరుడుగట్టిన ఉగ్రవాదులు చనిపోయారని చెప్పారు. టెర్రరిస్టులు చనిపోవడంతో పాక్​ మిలటరి అధికారులు కన్నీరు పెట్టుకున్నారని పేర్కొన్నారు.

    READ ALSO  Helicopter Manufacturing Center | నాగ్‌పూర్‌లో అత్యాధునిక హెలికాప్టర్ తయారీ కేంద్రం.. మాక్స్ ఏరోస్పేస్తో ‘మహా’ సర్కారు ఒప్పందం

    PM Modi | పాక్​కు బుద్ధి చెప్పాం

    ఆపరేషన్​ సిందూర్​తో పాక్​ నిరాశకు లోనయిందని ప్రధాని పేర్కొన్నారు. ఉగ్రవాదులను అంతం చేస్తే ఆ దేశం భారత ప్రజలు, ఆలయాలు, గురుద్వారాలపై దాడులకు యత్నించిందన్నారు. పాక్​ దాడులను భారత ఎయిర్​ డిఫెన్స్​ సిస్టం సమర్థవంతంగా అడ్డుకుందన్నారు. ఆ దేశం ప్రయోగించిన మిసైళ్లు మనల్ని తాకలేకపోయాయన్నారు. అయితే భారత సేనలు మాత్రం పాక్​లోకి చొచ్చుకువెళ్లి మరీ దాడులు చేశాయని మోదీ తెలిపారు. భారత్‌పై మళ్లీ దాడి చేస్తే ముఖం పగిలే సమాధానం చెబుతామని స్పష్టం చేశారు.

    PM Modi | పాక్​ భయపడింది

    డ్రోన్లు, మిసైళ్లతో పాక్​ దాడులు చేయడంతో భారత్ ప్రతిదాడులు చేసినట్లు మోదీ తెలిపారు. ఆ దేశంలోని పలు కీలక ఎయిర్​బేస్​లపై బాంబులు వేశామన్నారు. దీంతో అవి తీవ్రంగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. ఒక్కదాడితోనే పాక్​ భయపడిపోయిందని మోదీ అన్నారు. దీంతో ఆత్మరక్షణలో పాడిన పాక్​ ప్రపంచ దేశాల సాయం కోరిందని మోదీ స్పష్టం చేశారు. చివరికి ఈ నెల 10వ తేదీన పాకిస్తాన్​ భారత్​ డీజీఎంవోను సంప్రదించిందన్నారు. దీంతో కాల్పుల విరమణకు అంగీకరించినట్లు తెలిపారు. ఉగ్రవాదులు దాడి చేస్తే ఇలాగే ప్రతిస్పందిస్తామని ఆయన స్పష్టం చేశారు.

    READ ALSO  Plane Crash | ‘విమాన ప్రమాదం తర్వాత నా తల్లి, కుమార్తె కనిపించడం లేదు’

    PM Modi | బ్లాక్​మెయిల్​ను సహించం

    పాకిస్తాన్​ తమ వద్ద అణుబాంబులు ఉన్నాయని చెప్పి బ్లాక్​మెయిల్​ చేస్తూ ఉగ్రదాడులకు పాల్పడితే సహించమని మోదీ హెచ్చరించారు. ఆపరేషన్​ సిందూర్​ను ప్రస్తుతం నిలిపివేశామని, పాక్​ చర్యలను బట్టి ప్రతిస్పందన ఉంటుందని మోదీ తేల్చి చెప్పారు.

    PM Modi | వాటిపైనే చర్చ

    ఉగ్రవాదం‌– వాణిజ్యం, నీరు –రక్తం ఒక్కచోట ఉండలేవని మోదీ స్పష్టం చేశారు. పాకిస్తాన్​తో చర్చలు ఉంటే ఉగ్రవాదం, పీవోకేపై మాత్రమే ఉంటాయన్నారు. మిగతా విషయాల్లో ఆ దేశంతో ఎలాంటి చర్చల ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. దీంతో పాక్​తో వాణిజ్యం రద్దు, సింధూ నది జలాల ఒప్పందం రద్దు అలాగే ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

    Latest articles

    Bhubarathi | భూభారతి దరఖాస్తులను పెండింగ్​లో పెట్టొద్దు

    అక్షరటుడే,బోధన్: Bhubarathi | భూభారతి దరఖాస్తును ఎట్టిపరిస్థితుల్లో పెండింగ్​లో ఉంచవద్దని బోధన్​ సబ్​ కలెక్టర్​ వికాస్​ మహతో (Sub-Collector...

    KTR | రేవంత్​రెడ్డి లొట్టపీసు ముఖ్యమంత్రి : కేటీఆర్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : KTR | సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy)పై మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​...

    Tirumala | శ్రీవారి భక్తులకు అలర్ట్​.. సెప్టెంబర్​ టికెట్ల విడుదల ఎప్పుడంటే..

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Tirumala | తిరుమల(Tirumala) వేంకటేశ్వర స్వామిని నిత్యం వేలమంది భక్తులు దర్శించుకుంటారు. స్వామివారి దర్శనానికి సంబంధించి...

    Iran Missile Attack | అమెరికా ఎంబసీపై ఇరాన్‌ దాడి.. రాయబార కార్యాలయం మూసివేత

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Iran Missile Attack | ఇజ్రాయెల్‌పై (Israel) దాడులను అడ్డుకుంటే అమెరికా, ఫ్రాన్స్‌ తదితర...

    More like this

    Bhubarathi | భూభారతి దరఖాస్తులను పెండింగ్​లో పెట్టొద్దు

    అక్షరటుడే,బోధన్: Bhubarathi | భూభారతి దరఖాస్తును ఎట్టిపరిస్థితుల్లో పెండింగ్​లో ఉంచవద్దని బోధన్​ సబ్​ కలెక్టర్​ వికాస్​ మహతో (Sub-Collector...

    KTR | రేవంత్​రెడ్డి లొట్టపీసు ముఖ్యమంత్రి : కేటీఆర్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : KTR | సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy)పై మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​...

    Tirumala | శ్రీవారి భక్తులకు అలర్ట్​.. సెప్టెంబర్​ టికెట్ల విడుదల ఎప్పుడంటే..

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Tirumala | తిరుమల(Tirumala) వేంకటేశ్వర స్వామిని నిత్యం వేలమంది భక్తులు దర్శించుకుంటారు. స్వామివారి దర్శనానికి సంబంధించి...