More
    Homeఅంతర్జాతీయంOperation Sindoor | పాక్​ను తీవ్రంగా దెబ్బకొట్టాం.. ఆ దేశం చెప్పుకోవడం లేదు

    Operation Sindoor | పాక్​ను తీవ్రంగా దెబ్బకొట్టాం.. ఆ దేశం చెప్పుకోవడం లేదు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Operation Sindoor | ఆపరేషన్​ సిందూర్ operation sindoor​ అనంతరం జరిగిన పరిణామాలతో భారత్​ పాక్​పై దాడులు చేసిందని డీజీఎంవోలు DGMO తెలిపారు. ఈ దాడుల్లో తీవ్రంగా నష్టపోయిన పాక్​.. తనకు జరిగిన డ్యామేజీ గురించి చెప్పుకోవడం లేదన్నారు. డీజీఎంవో రాజీవ్​ఘాయ్​, ఎయిర్​ మార్షల్​ ఏకే భారతి, నేవీ చీఫ్​ ప్రమోద్​ సోమవారం మీడియాతో మాట్లాడారు. ఉగ్రవాదులు, వారికి సాయం చేసే వారే లక్ష్యంగా ఆపరేషన్​ సిందూర్​ చేపట్టామని తెలిపారు. మనం ఉగ్రవాదులపై పోరాటం చేస్తున్నామని స్పష్టం చేశారు. కానీ పాకిస్తాన్ pakistan​ తమపై దాడి చేస్తుందని అనుకుంటోందన్నారు. ఉగ్రవాదానికి పాకిస్తాన్​ అండగా నిలిచిందని పేర్కొన్నారు.

    Operation Sindoor | ఆట కట్టించిన ‘ఆకాశ్’

    ఉగ్రవాదులపై భారత్​ దాడులకు ప్రతీకారంగా పాక్​ ​ వివిధ రకాల డ్రోన్​లను ప్రయోగించిందన్నారు. వివిధ రకాల ఎయిర్​ డిఫెన్స్​ వ్యవస్థలతో air defence systems పాకిస్తాన్​ను అడ్డుకున్నామని చెప్పారు. ముఖ్యంగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఆకాశ్​ క్షిపణులతో akash missile విజయవంతంగా శత్రువును అడ్డుకున్నట్లు తెలిపారు. చైనా తయారు చేసిన పీ–15 మిస్సైళ్లతో పాక్​ దాడి చేసిందన్నారు. వాటిని ఆకాశ్​ క్షిపణులతో నిర్వీర్యం చేశామని చెప్పారు. టర్కీ డ్రోన్లను దాయాది దేశం ఉపయోగించిందన్నారు. భారత్​ను ఏ దేశ ఆయుధాలు ఏమీ చేయలేవన్నారు.

    READ ALSO  Pahalgam terror attack | ప‌హల్​గామ్​ ఉగ్ర‌దాడి కేసులో ముంద‌డుగు.. ఇద్ద‌రు కీల‌క వ్య‌క్తుల‌ను అరెస్టు చేసిన ఎన్ఐఏ

    Operation Sindoor | సర్వ సన్నద్ధంగా సైన్యం

    ప్రస్తుత పరిస్థితుల్లో భారత దళాలు ఎలాంటి ఆపరేషన్లకైనా సర్వసన్నద్ధంగా ఉన్నాయని వారు తెలిపారు. దేశ ప్రజలంతా తమకు అండగా నిలిచారన్నారు. పాకిస్తాన్​ నూర్​ఖాన్​ ఎయిర్​బేస్​పై ఇండియన్​ ఎయిర్​ ఫోర్స్​ చేసిన దాడిలో తీవ్ర నష్టం జరిగిందని చెప్పారు. ఎయిర్​బేస్​ రన్​వే తీవ్రంగా దెబ్బతిన్నదని పేర్కొన్నారు. 9, 10 తేదీల్లో పాకిస్తాన్​ మన వైమానిక స్థావరాలే టార్గెట్​గా దాడులు చేసేందుకు యత్నించిందన్నారు. మల్టీ లెవల్​ ఎయిర్​ డిఫెన్స్​ సిస్టం పాక్​ డ్రోన్లు, క్షిపణులను అడ్డుకుందన్నారు.

    Operation Sindoor | అణుస్థావరాలపై దాడులు చేయలేదు

    ఉగ్రవాదులు కొన్నేళ్లుగా తమ వ్యూహాలను మార్చుకుంటున్నారని అధికారులు తెలిపారు. సైనికులనే కాకుండా, యాత్రికులను, భక్తులను కూడా టార్గెట్​ చేసుకుంటున్నారని వివరించారు. ఉగ్రవాదులను అంతం చేయడమే భారత్​ లక్ష్యమన్నారు. పాకిస్తాన్​లోని అణుస్థావరాలే లక్ష్యంగా తాము దాడులు చేయలేదని ఎయిర్​ మార్షల్​ ఏకే భారతి తెలిపారు. పాక్​లోని కిరాణ హిల్ష్​పై దాడి చేయలేదన్నారు. అక్కడ ఏముందో తమకు తెలియని చెప్పారు. అయితే పాక్​లోని రక్షణ వ్యవస్థలను నాశనం చేశామని ఆయన వివరించారు.

    READ ALSO  Nobel Prize | ట్రంప్​ శాంతి దూత.. నోబెల్​ బహుమతి ఇవ్వాలని ప్రతిపాదనలు

    Latest articles

    Amit Shah | నేడు రాష్ట్రానికి కేంద్ర హోం మంత్రి అమిత్​షా రాక..

    అక్షరటుడే, ఇందూరు: Amit Shah | తెలంగాణ రాష్ట్రానికి నేడు కేంద్ర మంత్రి అమిత్​షా వస్తున్నారు. నిజామాబాద్​ జిల్లాలో...

    Yoga Asanas | వర్షాకాలంలో కీళ్ల నొప్పులు.. ఈ యోగాసనాలతో దూరం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Yoga Asanas | వర్షాకాలంలో వాతావరణంలో మార్పులతో అనారోగ్య సమస్యలు(Health problems) తలెత్తే అవకాశాలు...

    Media | పెరిగిన విష సంస్కృతి.. మీడియాపై దాడి.. ఉన్మాద స్థాయికి దిగజారిన రాజకీయాలు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Media : ప్రజాస్వామ్యం(democracy)లో నాలుగో స్తంభంగా పేర్కొనే మీడియా సంస్థలపై ఇటీవల దాడులు పెరిగిపోయాయి. రాజకీయ,...

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ – 29 జూన్​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంవిక్రమ సంవత్సరం – 2081 పింగళఉత్తరాయణంగ్రీష్మ రుతువురోజు – ఆదివారంమాసం – ఆషాఢపక్షం...

    More like this

    Amit Shah | నేడు రాష్ట్రానికి కేంద్ర హోం మంత్రి అమిత్​షా రాక..

    అక్షరటుడే, ఇందూరు: Amit Shah | తెలంగాణ రాష్ట్రానికి నేడు కేంద్ర మంత్రి అమిత్​షా వస్తున్నారు. నిజామాబాద్​ జిల్లాలో...

    Yoga Asanas | వర్షాకాలంలో కీళ్ల నొప్పులు.. ఈ యోగాసనాలతో దూరం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Yoga Asanas | వర్షాకాలంలో వాతావరణంలో మార్పులతో అనారోగ్య సమస్యలు(Health problems) తలెత్తే అవకాశాలు...

    Media | పెరిగిన విష సంస్కృతి.. మీడియాపై దాడి.. ఉన్మాద స్థాయికి దిగజారిన రాజకీయాలు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Media : ప్రజాస్వామ్యం(democracy)లో నాలుగో స్తంభంగా పేర్కొనే మీడియా సంస్థలపై ఇటీవల దాడులు పెరిగిపోయాయి. రాజకీయ,...