అక్షరటుడే, వెబ్డెస్క్ : Maharashtra | మహారాష్ట్ర maharashtraలో భారీ అగ్ని ప్రమాదం fire accident చోటుచేసుంది. మంటలు వ్యాపించి 22 గోదాములు కాలిపోవడంతో భారీ ఆస్తి నష్టం సంభవించింది. మహారాష్ట్రలోని థానే జిల్లా భీవండిలో సోమవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో సుమారు 22 గోదాములు కాలిపోయాయి. మొదట ఓ డెకరేషన్ గోదాములో మంటలు చెలరేగాయి. అనంతరం ఒక్కసారిగా మంటలు మిగతా గోదాములకు వ్యాపించాయి. దీంతో అవి కాలి బూడిదయ్యాయి.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది నాలుగు ఫైరింజన్లతో fire engines మంటలను ఆర్పివేశారు. పోలీసులు కూడా ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్నారు. ఆయా గోదాముల్లోని వస్తువులు కాలిపోవడంతో రూ.కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం.
పలు గోడౌన్లలో రసాయనాలు ఉండటంతో మంటలు భారీగా చెలరేగుతున్నాయి. దీంతో వాటిని అదుపు చేయడానికి అగ్ని మాపక సిబ్బంది fire staff కి సవాల్గా మారింది. మరోవైపు మంటలతో భారీగా పొగ అలుముకోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. అయితే ప్రాణనష్టంపై ఎలాంటి స్పష్టత లేదు. మంటలు అదుపులోకి వచ్చాక పూర్తి వివరాలను అధికారులు తెలిపే అవకాశం ఉంది.