అక్షరటుడే, వెబ్డెస్క్: Chhattisgarh | ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 13 మంది దుర్మరణం చెందారు. మరో 11 మంది గాయపడ్డారు. రాయ్పుర్ జిల్లా Raipur district రాయ్పుర్ – బలోద బజార్ రోడ్డు Raipur – Baloda Bazaar road లోని సరగావ్ సమీపం వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ప్రయాణికులతో వెళ్తున్న ఓ వాహనాన్ని ట్రక్కు ఢీ కొనడం వల్ల ఈ యాక్సిడెంట్ జరిగింది. మృతుల్లో తొమ్మిది మంది మహిళలు, నలుగురు చిన్నారులు ఉన్నారు. చటౌడ్ గ్రామానికి చెందిన ఒక కుటుంబం బన్సారీ గ్రామంలో జరిగిన కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా ప్రమాదం బారిన పడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను రాయ్పుర్లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మెమోరియల్ ఆస్పత్రి (Dr. BR Ambedkar Memorial Hospital)కి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. జిల్లా అధికారులు ప్రమాద స్థలానికి చేరుకుని, పరిస్థితిని సమీక్షించారని రాయ్పుర్ జిల్లా కలెక్టర్ గౌరవ్ సింగ్ పేర్కొన్నారు. ధార్సివా ఎమ్మెల్యే అనుజ్ శర్మ ఈ ప్రమాదంపై స్పందించి మాట్లాడారు. తాను అధికారులతో మాట్లాడినట్లు వెల్లడించారు.