More
    Homeజిల్లాలుకామారెడ్డిNizamsagar | మొక్కల పెంపకంపై నిర్లక్ష్యమేల..! నర్సరీలపై కొరవడిన అధికారుల పర్యవేక్షణ

    Nizamsagar | మొక్కల పెంపకంపై నిర్లక్ష్యమేల..! నర్సరీలపై కొరవడిన అధికారుల పర్యవేక్షణ

    Published on

    అక్షరటుడే, నిజాంసాగర్: Nizamsagar | రాష్ట్ర ప్రభుత్వం (state governament) మొక్కల పెంపకం కోసం ఖర్చు చేస్తున్న కోట్ల రూపాయలు వృథాగా మారుతున్నాయి. నర్సరీల్లో (nurseries) నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. దీంతో మొక్కల పెంపకం సక్రమంగా సాగడంలేదు. అధికారుల (officials) పర్యవేక్షణ సైతం కొరవడడంతో లక్ష్యం నెరవేరడం లేదు.

    మొక్కల పెంపకం కోసం రాష్ట్ర ప్రభుత్వం (state governament) ప్రతి పంచాయతీలో రూ. లక్షలు ఖర్చు చేసి నర్సరీలను ఏర్పాటు చేసింది. వీటిలో మొక్కలను పెంచేందుకు కావాల్సిన అన్ని సౌకర్యాలను కల్పించింది. ప్రతి నర్సరీలో (nurseries) 4వేల మొక్కలను సిద్ధం చేయాలని సూచించింది. వర్షాకాలం నాటికి ప్రతి గ్రామంలో మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉంచాలని తెలిపింది. వీటిని గ్రామ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు వ్యవసాయ పొలాల (governament and private agriculture crops) వద్ద పెరటి తోట్ల వద్ద నాటేందుకు లక్ష్యాన్ని నిర్దేశించింది.

    READ ALSO  CM Revanth | బీఆర్​ఎస్​ హయాంలోనే బనకచర్లకు అంకురార్పణ : సీఎం రేవంత్​రెడ్డి

    Nizamsagar | నీరు గారుతున్న లక్ష్యం

    మొక్కల పెంపకంలో ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతుంది. పెద్ద కొడప్​గల్​ మండలంలోని (peddakodapgal mandal) చిన్నదేవి సింగ్ తండా, విఠల్​వాడి తండాలలో ఏర్పాటు చేసిన నర్సరీల్లో బెడ్లు సిద్ధం చేసినా.. వాటిలో మొక్కల జాడ కనిపించడం లేదు. మరో రెండు నెలల్లో మొక్కలు నాటాల్సి ఉన్నా బెడ్లు మాత్రమే దర్శనమిస్తున్నాయి. ఇప్పటి వరకు మొక్కల పెంపకం ప్రారంభించకపోతే ఎలా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇలా ఈ రెండు చోట్ల మాత్రమే కాదు జుక్కల్​ నియోజకవర్గంలోని (jukkal constituency) పిట్లం, బిచ్కుంద, పెద్దకొడప్​గల్​, జుక్కల్​ తదితర మండలాల్లోని పలు నర్సరీల్లో నెలకొంది. కాగా.. పర్యవేక్షించాల్సిన అధికారులు పత్తా లేకుండా పోయారని చెబుతున్నారు.

    Nizamsagar | పెంపకం లక్ష్యాన్ని తగ్గించినా..

    ఒక్కో గ్రామ పంచాయతీలో (gram panchayat) గతంలో పదివేల మొక్కలను సిద్ధం చేయాల్సిన లక్ష్యం ఉండగా లక్ష్యాన్ని అందుకోలేకపోతున్నారు. దీంతో ఈ సంవత్సరం ప్రతి నర్సరీలో 4వేల మొక్కలకు (4 thousand plants) మాత్రమే పరిమితం చేశారు. అయినప్పటికీ వాటిని కూడా సిద్ధం చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి మొక్కల పెంపకంపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.

    READ ALSO  Mahadev Maharaj Swami | యోగా మహోత్సవానికి తరలిరావాలి

    Latest articles

    8 Vasanthalu | 8 వసంతాలు మూవీ ఫుల్ రివ్యూ.. సినిమా హిట్ కొట్టినట్టేనా?

    అక్షరటుడే, వెబ్​డెస్క్:8 Vasanthalu | అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్(Mytri Movie Makers)బ్యానర్ లో మ్యాడ్...

    Flyover | ఓ వైపు ఫ్తైఓవర్​ పనులు.. దానికి అడ్డుగా మరోవైపు G+2 భవన నిర్మాణం.. రూ.75 కోట్ల ప్రజాధనం వృథా

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Flyover : రాజకీయ నాయకులు, వారి కుటుంబ సభ్యులే గుత్తేదారులుగా మారుతున్నారు. అభివృద్ధి పేరిట అడ్డగోలుగా...

    Swiss bank | స్విస్​ బ్యాంకుల్లో డబ్బును తెగ దాచేస్తున్న భారతీయులు.. గతేడాది కంటే మూడు రెట్లు పెరిగిన డిపాజిట్లు

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Swiss bank : కరోనా(Corona)తో సామాన్యులకు ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ తగిలింది. ఐదేళ్లు అయినా నిలదొక్కుకోలేని...

    Today Gold Price | త‌గ్గ‌నంటున్న బంగారం.. సామాన్యులు ఇక పసిడి కొనడం కష్టమేనా..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : బంగారం Gold ధ‌ర‌లలో ఈ మ‌ధ్య చాలా మార్పులు చోటు...

    More like this

    8 Vasanthalu | 8 వసంతాలు మూవీ ఫుల్ రివ్యూ.. సినిమా హిట్ కొట్టినట్టేనా?

    అక్షరటుడే, వెబ్​డెస్క్:8 Vasanthalu | అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్(Mytri Movie Makers)బ్యానర్ లో మ్యాడ్...

    Flyover | ఓ వైపు ఫ్తైఓవర్​ పనులు.. దానికి అడ్డుగా మరోవైపు G+2 భవన నిర్మాణం.. రూ.75 కోట్ల ప్రజాధనం వృథా

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Flyover : రాజకీయ నాయకులు, వారి కుటుంబ సభ్యులే గుత్తేదారులుగా మారుతున్నారు. అభివృద్ధి పేరిట అడ్డగోలుగా...

    Swiss bank | స్విస్​ బ్యాంకుల్లో డబ్బును తెగ దాచేస్తున్న భారతీయులు.. గతేడాది కంటే మూడు రెట్లు పెరిగిన డిపాజిట్లు

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Swiss bank : కరోనా(Corona)తో సామాన్యులకు ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ తగిలింది. ఐదేళ్లు అయినా నిలదొక్కుకోలేని...