More
    HomeజాతీయంOperation Sindoor | ఆపరేషన్​ సిందూర్​ కొనసాగుతోంది.. ఇండియన్​ ఎయిర్​ఫోర్స్​ కీలక ప్రకటన

    Operation Sindoor | ఆపరేషన్​ సిందూర్​ కొనసాగుతోంది.. ఇండియన్​ ఎయిర్​ఫోర్స్​ కీలక ప్రకటన

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Operation Sindoor | ఇండియన్​ ఎయిర్​ఫోర్స్ indian air force​ కీలక ప్రకటన చేసింది. ఆపరేషన్​ సిందూర్ operation sindoor​ ఇంకా కొనసాగుతోందని ప్రకటించింది. ఈ మేరకు ఎక్స్​ వేదికగా ఆదివారం ఉదయం పోస్ట్​ చేసింది. కాగా ఆపరేషన్​ సిందూర్ అనంతరం భారత్​ – పాకిస్తాన్​ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. పాక్​ భారత్​లోని పలు ప్రాంతాలపై దాడులు చేయగా భారత్​ తిప్పి కొట్టింది. అనంతరం భారత్​ ప్రతిదాడులు చేసింది. పాకిస్తాన్​లోని ఎయిర్​ బేస్​లు, మిలటరీ స్థావరాలే లక్ష్యంగా భారత వైమానిక దళం దాడులు చేసింది.

    Operation Sindoor | కాల్పుల విరమణ

    ఉద్రిక్తతలు తగ్గించడానికి ఇరు దేశాల ఆర్మీ జనరల్స్ army generals​ చర్చించి కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నారు. శనివారం సాయంత్రం ఐదు గంటల నుంచి కాల్పుల విరమణ ceasefire అమలులోకి వచ్చింది. అయితే ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాక్​ శనివారం రాత్రి సరిహద్దులోని పలు ప్రాంతాలపై దాడులు చేసింది. ఈ క్రమంలో ఆపరేషన్​ సిందూర్​ ఇంకా కొనసాగుతోందని ఇండియన్​ ఎయిర్​ ఫోర్స్​ ప్రకటించడం గమనార్హం. తమకు అప్పగించిన పనులను విజయవంతంగా పూర్తి చేశామని, అత్యంత కచ్చితత్వం దాడులు చేశామని ఐఏఎఫ్​ పేర్కొంది. ఆపరేషన్‌ సిందూర్​పై తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని ఐఏఎఫ్​ ట్వీట్​ చేసింది.

    READ ALSO  AgriGold | నెరవేరనున్న అగ్రిగోల్డ్ బాధితుల దశాబ్దాల కల.. కోర్టు ఆదేశాలతో త్వరలోనే ఆస్తుల పంపిణీ!

    Operation Sindoor | కాసేపట్లో ప్రకటన

    ప్రధాని మోదీ (pm modi) తన నివాసంలో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఆపరేషన్​ సిందూర్​, కాల్పుల విరమణ అంశంపై ఆయన రక్షణ శాఖ అధికారులతో చర్చిస్తున్నారు. ఈ క్రమంలో ఐఏఎఫ్​ IAF ప్రకటన చేయడం గమనార్మం. ఉగ్రవాదంపై పోరు కొనసాగుతుందని చెప్పేలా ఇలా ట్వీట్​ చేసిందా.. లేదా పాక్​ దాడులకు ప్రతిదాడులు తప్పవనే ఉద్దేశంలో చేసిందా అని తెలియాల్సి ఉంది. దీని మరికొద్ది సేపట్లో రక్షణశాఖ, విదేశాంగ అధికారులు వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.

    Operation Sindoor | అప్రమత్తంగా సైన్యం

    కాల్పుల విరమణ అమలులోకి వచ్చిన భారత సైన్యం సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉంది. భారీ ఆయుధాలు, గగనతల రక్షణ వ్యవస్థతో పహారా కాస్తోంది. పాక్​ శనివారం రాత్రి దాడులు చేయడంతో మళ్లీ ఆ దేశం ఒప్పందాన్ని ఉల్లంఘించే అవకాశం ఉందని భావించిన కేంద్రం సైన్యానికి ఫుల్​ పవర్స్​ ఇస్తున్నట్లు ప్రకటించింది. దీంతో పాక్​ మళ్లీ దాడులకు పాల్పడితే తగిన బుద్ధి చెప్పడానికి సైన్యం సన్నద్ధంగా ఉంది.

    READ ALSO  ED Raids | వాల్మీకి స్కామ్​లో ఈడీ దూకుడు.. ఎంపీ, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడులు

    Latest articles

    Air India flight | ఎయిర్ ఇండియా ప్రయాణికులకు షాక్​.. టేకాఫ్​ అయ్యాక వెనక్కి మళ్లిన ఫ్లైట్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Air India flight : ఢిల్లీ నుంచి రాంచీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాన్ని...

    Navodaya schools | గుడ్​న్యూస్​.. ప్రారంభం కానున్న నవోదయ పాఠశాలలు

    అక్షరటుడే, హైదరాబాద్: Navodaya schools : తెలంగాణలో 7 నవోదయ విద్యాలయాలు ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు నవోదయ విద్యాలయ...

    Israel – Iran War | యాంకర్ న్యూస్ చదువుతుండగా మిస్సెల్ అటాక్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Israel - Iran War : ఇజ్రాయెల్ - ఇరాన్ దేశాల మధ్య పరస్పర దాడులు...

    Robert Vadra | మనీలాండరింగ్ కేసులో రాబర్ట్ వాద్రాకు ED సమన్లు.. ఆ రోజు విచారణకు రావాల్సిందే!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Robert Vadra : కాంగ్రెస్ పార్లమెంటు సభ్యురాలు(ఎంపీ) ప్రియాంక గాంధీ (Congress MP Priyanka Gandhi)...

    More like this

    Air India flight | ఎయిర్ ఇండియా ప్రయాణికులకు షాక్​.. టేకాఫ్​ అయ్యాక వెనక్కి మళ్లిన ఫ్లైట్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Air India flight : ఢిల్లీ నుంచి రాంచీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాన్ని...

    Navodaya schools | గుడ్​న్యూస్​.. ప్రారంభం కానున్న నవోదయ పాఠశాలలు

    అక్షరటుడే, హైదరాబాద్: Navodaya schools : తెలంగాణలో 7 నవోదయ విద్యాలయాలు ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు నవోదయ విద్యాలయ...

    Israel – Iran War | యాంకర్ న్యూస్ చదువుతుండగా మిస్సెల్ అటాక్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Israel - Iran War : ఇజ్రాయెల్ - ఇరాన్ దేశాల మధ్య పరస్పర దాడులు...