అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Inter Supplementary Exams | జిల్లాలో మేనెలలో జరిగిన సప్లిమెంటరీ పరీక్షలలో 57.46 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు జిల్లా ఇంటర్ విద్యాధికారి (DIEO) రవికుమార్ తెలిపారు. జనరల్ సెకండియర్లో మొత్తం 6,497 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 3,733 మంది విద్యార్థులు పాసై 57.46 శాతం ఉత్తీర్ణత సాధించారన్నారు. ఒకేషనల్ సెకండియర్లో మొత్తం 899 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా.. 503 మంది ఉత్తీర్ణులయ్యారని పేర్కొన్నారు. మొత్తం 55 శాతం మంది ఉత్తీర్ణత సాధించారని తెలిపారు.
ఫస్టియర్లో జనరల్ విద్యార్థులు 10,098 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 5,851 మంది విద్యార్థులు పాస్అయ్యారన్నారు. 58 శాతం ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. ఒకేషనల్ ఫస్టియర్లో 1,420 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 903 మంది విద్యార్థులు పాసయ్యారని తెలిపారు. 63.59 శాతం ఉత్తీర్ణత సాధించారని వివరించారు. రాష్ట్రం మొత్తం మీద సెకండియర్లో ఉత్తీర్ణత శాతం 20వ స్థానంలో ఉండగా, ఫస్టియర్లో ఉత్తీర్ణత శాతం 26వ స్థానంలో ఉందన్నారు. ఇక రీవాల్యుయేషన్, రీవెరిఫికేషన్ కోసం ఈనెల 17వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.