More
    HomeజాతీయంTerror Attack | శరీరంలో 42 బుల్లెట్లు.. కిరాతకంగా చంపిన ఉగ్రవాదులు

    Terror Attack | శరీరంలో 42 బుల్లెట్లు.. కిరాతకంగా చంపిన ఉగ్రవాదులు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Terror Attack |కశ్మీర్​లోని పహల్గామ్(Pahalgam)​లో ఉగ్రదాడిలో ఉగ్రవాదుల అకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. సెలవుల్లో ఆనందంగా గడపడానికి వెళ్లిన పర్యాటకులను టెర్రరిస్టులు(Terrorists) కనికరం లేకుండా కాల్చి చంపారు. ఈ ఘటనలో 26 మంది మృతి చెందగా.. పలువురు గాయపడ్డ విషయం తెలిసిందే. అయితే నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూదన్​రావు​పై ఉగ్రవాదులు విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. ఆయన శరీరంలో 42 బుల్లెట్లు ఉన్నట్లు సమాచారం. దీనిని బట్టి టెర్రరిస్టులు ఎలా రెచ్చిపోయారో తెలుస్తుంది. కాగా మధుసూదన్​రావు బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్​గా పనిచేస్తూ అక్కడే స్థిరపడ్డాడు. కుటుంబంతో కలిసి కశ్మీర్​(Kashmir) అందాలను చూడటానికి వెళ్లి ఉగ్రదాడిలో మృతి చెందాడు.

    పహల్గామ్​ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర కేబినెట్(Central Cabinet)​ అత్యవసరంగా సమావేశం కానుంది. ఈ మేరకు మంత్రులు(Ministers) ఢిల్లీకి బయలు దేరారు. ఇప్పటికే ప్రధాని మోదీ(Prime Minister Modi) తన సౌదీ అరేబియా పర్యటను అర్ధంతరంగా ముగించుకొని తిరిగి వచ్చిన విషయం తెలిసిందే. ఆయన ఢిల్లీ ఎయిర్​పోర్టులోనే విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్​, జాతీయ భద్రతా సలహాదారు అజిత్​ దోవల్​తో సమావేశం అయ్యారు. ఘటనపై వివరాలు ఆరా తీశారు. అయితే కేబినెట్​ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.

    Latest articles

    EPFO | ఈపీఎఫ్​ చందాదారులకు శుభవార్త.. రూ.5 లక్షలకు పెరుగనున్న ఆటో సెటిల్మెంట్ పరిమితి

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: EPFO | ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) చందాదారులకు త్వరలోనే శుభవార్త రానుంది. ఈపీఎఫ్​వో సెంట్రల్...

    deemed university | డీమ్డ్ వర్సిటీ హోదా ఇవ్వడంపై యూజీసీకి హైకోర్టు కీలక ఆదేశాలు

    అక్షరటుడే, హైదరాబాద్: తెలంగాణలోని విద్యా సంస్థలకు యూజీసీ మంజూరు చేసే డీమ్డ్ వర్సిటీ హోదాను తుది తీర్పునకు లోబడి...

    Pahalgam terror attack | ఉగ్రవాదంపై కఠిన చర్యలు..అఖిల పక్ష భేటీలో నిర్ణయం

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Pahalgam terror attack : ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు అఖిలపక్ష నేతలకు కేంద్ర ప్రభుత్వం...

    Nizamabad rural Mla | ఆలయ నిర్మాణానికి సహకారం అందించాలని ఎమ్మెల్యేకు వినతి

    అక్షరటుడే, నిజామాబాద్​ రూరల్​: ఆలయ నిర్మాణానికి సహకారం అందించాలని బోర్గాం(పి)లోని సాయిశ్రీ మహాలక్ష్మి కాలనీవాసులు ఎమ్మెల్యే భూపతిరెడ్డిని కలిశారు....

    More like this

    EPFO | ఈపీఎఫ్​ చందాదారులకు శుభవార్త.. రూ.5 లక్షలకు పెరుగనున్న ఆటో సెటిల్మెంట్ పరిమితి

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: EPFO | ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) చందాదారులకు త్వరలోనే శుభవార్త రానుంది. ఈపీఎఫ్​వో సెంట్రల్...

    deemed university | డీమ్డ్ వర్సిటీ హోదా ఇవ్వడంపై యూజీసీకి హైకోర్టు కీలక ఆదేశాలు

    అక్షరటుడే, హైదరాబాద్: తెలంగాణలోని విద్యా సంస్థలకు యూజీసీ మంజూరు చేసే డీమ్డ్ వర్సిటీ హోదాను తుది తీర్పునకు లోబడి...

    Pahalgam terror attack | ఉగ్రవాదంపై కఠిన చర్యలు..అఖిల పక్ష భేటీలో నిర్ణయం

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Pahalgam terror attack : ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు అఖిలపక్ష నేతలకు కేంద్ర ప్రభుత్వం...
    Verified by MonsterInsights