అక్షరటుడే, తిరుమల: Lord Venkateswara : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 10 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. నిన్న వేంకటేశ్వర స్వామిని 68,760 మంది భక్తులు దర్శించుకున్నారు. 27,544 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. రూ. 3.90 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది.
