అక్షరటుడే, ఇందూరు: SSC Supplementary Exams పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు డీఈవో అశోక్(Education Officer Ashok) తెలిపారు. పరీక్షలు ఉదయం 9:30 నుంచి 12:30 గంటల వరకు ఉంటాయన్నారు. విద్యార్థులు పరీక్షా కేంద్రానికి గంట ముందుగానే చేరుకోవాలని సూచించారు. పరీక్షలకు సంబంధించి డీఈవో కార్యాలయం(DEO Office)లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఏవైనా సందేహాలుంటే 90302 82993 ను సంప్రదించాలని కోరారు.
