అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Police Prajavani | నగరంలో పోలీస్శాఖ ఆధ్వర్యంలో సీపీ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. సీపీ సాయిచైతన్య (CP sai Chaitanya) ఈ సందర్భంగా ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదుదారుల సమస్యలను తెలుసుకుని చట్టపరంగా వాటికి పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడారు.
Police Prajavani | బాధ్యతతో పనిచేయాలి..
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఎలాంటి పైరవీలు లేకుండా స్వచ్ఛందంగా పోలీసు సేవల్ని వినియోగించుకోవాలని సూచించారు. పోలీసులు ప్రజలకు మరింత దగ్గరయ్యేలా, శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్శాఖ పనిచేస్తుందన్నారు.