More
    HomeజాతీయంAhmedabad plane crash | విమాన ప్రమాదంలో మొత్తం 242 మంది దుర్మరణం!

    Ahmedabad plane crash | విమాన ప్రమాదంలో మొత్తం 242 మంది దుర్మరణం!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Ahmedabad plane crash | గుజరాత్​లోని అహ్మదాబాద్​లో జరిగిన విమాన ప్రమాదం (Ahmedabad plane crash ) తీరని విషాదం మిగిల్చింది. గురువారం మధ్యాహ్నం టేకాఫ్​ అయిన కొద్దిసేపటికే ఎయిర్​ ఇండియా విమానం కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో విమానంలోని అందరూ మృతి చెందారు. సిబ్బంది, పైలట్లు సహా మొత్తం 242 మంది చనిపోయారని సమాచారం. మృతుల్లో 169 భారతీయులు, 53 మంది బ్రిటీష్ వాసులు, ఏడుగురు పోర్చుగీస్, ఒక కెనడియన్ ఉన్నారు. ఇద్దరు శిశువులతో పాటు 13 మంది చిన్నారులు కూడా మృతి చెందారని సమాచారం. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని (Former Gujarat Chief Minister Vijay Rupani) సైతం ప్రమాదంలో చనిపోయారు.

    Ahmedabad plane crash | క్షణాల్లోనే మంటలు వ్యాపించి..

    అహ్మదాబాద్​లో మధ్యాహ్నం టేకాఫ్‌ అయిన ఎయిరిండియా బోయింగ్ 787 డ్రీమ్‌ లైనర్ కొన్ని క్షణాలకే కుప్పకూలి పోయింది. అహ్మదాబాద్ నుంచి లండన్​కు వెళ్తున్న ఈ విమానం చెట్టును ఢీకొని హాస్టల్​పై పడడంతో భారీ విస్ఫోటనం జరిగింది. క్షణాల్లోనే మంటలు వ్యాపించి విమానం మొత్తం దగ్ధమైంది. ప్రమాదం సమయంలో విమానంలో ఉన్న 242 మంది ప్రయాణికులు, విమాన సిబ్బంది మంటల్లో సజీవ దహనమయ్యారు. ప్రయాణికుల్లో ఎవరూ బతికే అవకాశం లేదని అహ్మదాబాద్‌ సీపీ వెల్లడించారు. మరోవైపు, ఎయిర్ ఇండియా విమానంలో జరిగిన విషాదకరమైన విమానయాన సంఘటనలో గణనీయమైన సంఖ్యలో ప్రాణాలు కోల్పోయాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) గురువారం ధ్రువీకరించింది. అహ్మదాబాద్​లో జరిగినది చాలా విషాదకరమైన ప్రమాదమని, చాలా మందిని కోల్పోయామని MEA ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారందరికీ మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, ఖచ్చితమైన వివరాలు బయటకు రావడానికి మనం సమయం పడుతుందని చెప్పారు.

    READ ALSO  International Education City | ముంబైలో తొలి అంతర్జాతీయ విద్యానగరం.. క్యాంపస్లు ప్రారంభించనున్న అగ్రశ్రేణి వర్సిటీలు

    Ahmedabad plane crash | డీఎన్​ఏ టెస్ట్​ చేశాక..

    విమానం కూలిపోవడంతో మంటలు అంటుకొని పలువురి మృతదేహాలు గుర్తు పట్టలేనంతగా కాలిపోయాయి. దీంతో డీఎన్‌ఏ టెస్ట్ (DNA Test) చేశాక మృతదేహాలను అప్పగిస్తామని గుజరాత్ ఆరోగ్యశాఖ కార్యదర్శి వెల్లడించారు. ఘటనా స్థలం వద్ద అధికారుల సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు.

    Ahmedabad plane crash | రాకపోకలు ప్రారంభం

    విమాన ప్రమాదంతో మధ్యాహ్నం అహ్మదాబాద్​ విమానాశ్రయాన్ని అధికారులు మూసివేశారు. ప్రస్తుతం విమానాశ్రయంలో తిరిగి రాకపోకలు ప్రారంభమయ్యాయి. పరిమిత సంఖ్యలో విమానాల రాకపోకలను అనుమతిస్తున్నారు. ప్రమాదంతో మూడు గంటల పాటు ఎయిర్​ పోర్టు కార్యకలాపాలు నిలిచిపోయాయి.

    Latest articles

    Khamenei | ఖ‌మేనీని టార్గెట్ చేసిన ఇజ్రాయిల్‌.. చంపొద్ద‌ని వారించిన ట్రంప్‌

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Khamenei : ఇరాన్‌తో యుద్ధం జ‌రుగుతున్న వేళ ఇజ్రాయిల్ భారీ ప్ర‌ణాళిక వేసింది. ఇరాన్ సుప్రీం...

    Caste Census | జ‌న‌, కుల గ‌ణ‌న‌కు స‌న్నాహాలు.. సోమవారం నోటిఫికేష‌న్ విడుద‌ల

    అక్షరటుడే, న్యూఢిల్లీ: కేంద్ర ప్ర‌భుత్వం (central government) జ‌న గ‌ణ‌న‌(population Census)కు స‌న్నాహాలు చేస్తోంది. ఇందుకు సంబంధించి సోమ‌వారం...

    Sonia Gandhi | సోనియాగాంధీకి అస్వ‌స్త‌త‌.. ఆస్ప‌త్రిలో చేరిక‌

    అక్షరటుడే, న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియాగాంధీ (Senior Congress leader Sonia Gandhi) ఆదివారం అస్వ‌స్త‌త‌కు గుర‌య్యారు....

    CM Revanth | ఆధునిక పరిశ్రమ అవసరాలకు తగినట్లుగా ఐటీఐల సిలబస్‌ అప్‌గ్రేడ్.. ప్రత్యేక కమిటీకు సీఎం ఆదేశం​

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : తెలంగాణలో వీఎఫ్ఎక్స్‌, గేమింగ్‌, ఆడియో విజువల్స్ రంగాలకు సంబంధించి సెంటర్ ఆఫ్...

    More like this

    Khamenei | ఖ‌మేనీని టార్గెట్ చేసిన ఇజ్రాయిల్‌.. చంపొద్ద‌ని వారించిన ట్రంప్‌

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Khamenei : ఇరాన్‌తో యుద్ధం జ‌రుగుతున్న వేళ ఇజ్రాయిల్ భారీ ప్ర‌ణాళిక వేసింది. ఇరాన్ సుప్రీం...

    Caste Census | జ‌న‌, కుల గ‌ణ‌న‌కు స‌న్నాహాలు.. సోమవారం నోటిఫికేష‌న్ విడుద‌ల

    అక్షరటుడే, న్యూఢిల్లీ: కేంద్ర ప్ర‌భుత్వం (central government) జ‌న గ‌ణ‌న‌(population Census)కు స‌న్నాహాలు చేస్తోంది. ఇందుకు సంబంధించి సోమ‌వారం...

    Sonia Gandhi | సోనియాగాంధీకి అస్వ‌స్త‌త‌.. ఆస్ప‌త్రిలో చేరిక‌

    అక్షరటుడే, న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియాగాంధీ (Senior Congress leader Sonia Gandhi) ఆదివారం అస్వ‌స్త‌త‌కు గుర‌య్యారు....