అక్షరటుడే, కామారెడ్డి: Lok Adalat | జిల్లా కేంద్రంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ ద్వారా 1,848 కేసులకు పరిష్కారించామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి వరప్రసాద్ (Kamareddy District Chief Judge) తెలిపారు. శనివారం జిల్లా కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి వరప్రసాద్ మాట్లాడుతూ.. లోక్ అదాలత్ లో కేసు పరిష్కారమై అవార్డు పాస్ చేస్తే అది అంతిమ తీర్పు అవుతుందన్నారు.
Lok Adalat | 8 బెంచ్లు ఏర్పాటు..
కేసుల పరిష్కారం కోసం కోర్టులో 8 బెంచ్లను ఏర్పాటు చేశారు. క్రిమినల్ కాంపౌండబుల్ కేసులు 1,751 పరిష్కారం కాగా వాటికి సంబంధించిన రూ. 8,28,150 బాధితులకు అందేలా చేశారు. సివిల్ కేసులు రెండు, 15 మోటార్ యాక్సిడెంట్ కేసులకు రూ.1.80 కోట్లు, 37 సైబర్ క్రైమ్ కేసులకు రూ. 3.44 లక్షలు బాధితులకు అందేలా తీర్పులిచ్చారు.
కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (District Legal Services Authority) కార్యదర్శి నాగరాణి, సీనియర్ సివిల్ జడ్జి సుమలత, జూనియర్ సివిల్ జడ్జి సుధాకర్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కామారెడ్డి దీక్ష, జిల్లా అడిషనల్ ఎస్పీ నర్సింహా రెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నంద రమేష్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజా గోపాల్ గౌడ్, పోలీసులు, న్యాయవాదులు పాల్గొన్నారు.