అక్షరటుడే, వెబ్డెస్క్ : Land Scam | రాష్ట్రంలో భారీ భూ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. కాగా.. ఈ కుంభకోణంలో ఓ జాతీయ పార్టీకి చెందిన ఎంపీ హస్తం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
సిద్దిపేట siddipeta జిల్లాలో 176 ఎకరాల భూ కుంభకోణం land scam ఆరోపణలపై కలెక్టర్ మను చౌదరి Collector Manu Chowdhury స్పందించారు. ఆ ఆరోపణలపై విచారణకు నలుగురు సభ్యులతో కూడిన కమిటీ వేశారు. సిద్దిపేట జిల్లా అక్బర్పేట-భూంపల్లి Akbarpet-Bhoompally మండలం చౌదరిపల్లి Chowdhurypalli గ్రామంలోని 176 ఎకరాల లావుణి, అసైన్డ్ భూముల స్కామ్పై వాస్తవాలను నిగ్గు తేల్చాలని కలెక్టర్ నిర్ణయించారు. దీనికోసం నలుగురు రెవెన్యూ అధికారులతో విచారణ కమిటీ ఏర్పాటు చేశారు.
ఈ గ్రామంలో సర్వే నంబర్ 294లోని కొన్ని బై నంబర్ల భూమి మీద వివాదం ఏర్పడిన నేపథ్యంలో సమగ్ర విచారణకు ఆదేశించారు. ఈ కమిటీ సభ్యులు భూ వివాదం, దాని స్వభావంపై పూర్తిస్థాయి విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వన్నారు. ఆ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.
Land Scam | ఎంపీపై ఆరోపణలు
కాగా.. ఓ జాతీయ పార్టీకి చెందిన ఎంపీ MP అక్రమంగా 176 ఎకరాల పేద రైతుల అస్సైన్డ్ భూములు assigned lands స్వాహా చేశారని ఇటీవల సోషల్ మీడియా social media లో ప్రచారం జరిగింది. సదరు ఎంపీ ఆ భూమిని కూతురు, భార్య పేరిట రిజిస్ట్రేషన్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అంతేగాకుండా అసైన్డ్ భూమిని పట్టా భూమిగా మార్చారని ఆరోపణలు ఉన్నాయి. కాగా.. ఈ దందాపై పలువురు రైతులు కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. రైతుల ఫిర్యాదు, సోషల్ మీడియాలో ప్రచారం నేపథ్యంలో కలెక్టర్ స్పందించారు. విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని కమిటీని నియమించారు.