More
    Homeఅంతర్జాతీయంYou Tube Channels | భారత్​లో 63 మిలియన్ సబ్‌స్క్రైబర్లు కలిగిన 16 పాకిస్తాన్ యూట్యూబ్...

    You Tube Channels | భారత్​లో 63 మిలియన్ సబ్‌స్క్రైబర్లు కలిగిన 16 పాకిస్తాన్ యూట్యూబ్ ఛానళ్లపై నిషేధం.. బీబీసీపైనా అసంతృప్తి

    Published on

    అక్షరటుడే, న్యూఢిల్లీ:You Tube Channels | పహల్గావ్​ ఉగ్రదాడి(Pahalgam Terror Attack) తర్వాత ప్రోవొకేటివ్ (ఉత్తేజిత), మతపరమైన ఉద్రేకాన్ని కలిగించే కంటెంట్‌ను వ్యాప్తి చేస్తున్నారన్న ఆరోపణలపై 16 పాకిస్తానీ యూట్యూబ్ ఛానళ్లను భారత ప్రభుత్వం(India Government) నిషేధించింది. ఈ ఛానళ్లకు భారత్​లో సుమారు 63 మిలియన్ సబ్‌స్క్రైబర్లు(63 million subscribers) ఉన్నారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సిఫారసుల మేరకు వీటిని నిషేధించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

    నిషేధిత ఛానళ్ల జాబితాలో ఉన్నవి..

    ప్రముఖ న్యూస్ ఛానళ్లు: Dawn, ARY News, Samaa TV, Bol News, Geo News, Suno News, Raftar.

    జర్నలిస్టుల యూట్యూబ్ ఛానళ్లు..

    ఇర్షాద్ భట్టి, ఉమర్ చీమా, అస్మా షిరాజీ, మునీబ్ ఫారూక్.

    ఇతర ఛానళ్లు..

    The Pakistan Reference, Uzair Cricket, Samaa Sports, Razi Naama.

    READ ALSO  Nobel Prize | ట్రంప్​ శాంతి దూత.. నోబెల్​ బహుమతి ఇవ్వాలని ప్రతిపాదనలు

    ఈ ఛానళ్లన్నీ భారత్, భారత సైన్యం(Indian Army), భద్రతా సంస్థలపై తప్పుడు, దుష్ప్రచార కథనాలను ప్రచారం చేశాయనే ఆరోపణలు ఉన్నాయి. పహల్గావ్​ ఉగ్రదాడిలో 25 మంది పర్యాటకులతో పాటు ఒక కాశ్మీరీ మృతి చెందారు.

    ఈ ఛానళ్లను భారతదేశంలో యాక్సెస్ చేయాలంటే “ఈ కంటెంట్ ప్రస్తుతం ఈ కంట్రీలో అందుబాటులో లేదు. ప్రభుత్వ ఆదేశం ప్రకారం జాతీయ భద్రత / ప్రజా ప్రవర్తనకు సంబంధించిన అంశంగా పరిగణించి నిలిపివేయబడింది.” అనే సందేశం కనిపిస్తోంది.

    భారత్​ కఠిన చర్యలు..

    పహల్గావ్​ దాడి(Pahalgam Attack)లో పాకిస్తాన్ పాత్ర ఉందన్న అనుమానంతో భారత్ పలు చర్యలు చేపట్టింది. సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేయడంతో పాటు పాకిస్తానీ పౌరులకు ఇచ్చే వీసా సేవలను(Visa services) నిలిపివేసింది. ఇందుకు ప్రతిస్పందనగా పాకిస్తాన్ కూడా సిమ్లా ఒప్పందం సహా అన్ని ద్వైపాక్షిక ఒప్పందాలను నిలిపివేయడానికి తమకు కూడా హక్కు ఉందని ప్రకటించింది.

    READ ALSO  Bangalore House Rents | బెంగ‌ళూరులో ఇల్లు అద్దెకు తీసుకోవాలనుకుంటున్నారా.. ముందు ఇవి తెలుసుకోండి..!

    బీబీసీపై ప్రభుత్వ అసంతృప్తి

    బీబీసీ BBC Channel హెడ్​లైన్​ “Pakistan suspends visas for Indians after deadly Kashmir attack on tourists” అంటూ రాయడంపై ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. దీన్ని చూసి సోషల్ మీడియాలో నెటిజన్లు “భారత్ పర్యాటకులపై దాడి చేసినట్లుగా కనిపిస్తోంది” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

    ఈమేరకు దీనిపై కేంద్ర ప్రభుత్వం(Central government) బీబీసీ ఇండియా హెడ్ జాకీ మార్టిన్‌కు దేశ భావోద్వేగాలను తెలియజేస్తూ.. లేఖ పంపినట్టు సమాచారం. బీబీసీ ‘టెర్రరిస్ట్స్’ స్థానంలో ‘మిలిటెంట్స్’ అనే పదాన్ని వాడటంపై సైతం ప్రభుత్వం తప్పుబడుతోంది. బీబీసీ రిపోర్టింగ్‌(BBC reporting)ను నిరంతరం గమనించనున్నట్లు విదేశాంగ శాఖ ప్రకటించింది.

     

    Latest articles

    Char Dham Yatra | చార్​ధామ్ యాత్ర నిలిపివేత

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Char Dham Yatra | ఉత్తరాఖండ్ (Uttarakhand)​లో భారీ వర్షాలు (Heavy Rains) పడుతున్నాయి. వర్షాలు,...

    Minister seethakka | జిల్లాకు విచ్చేసిన ఇన్​ఛార్జి మంత్రి సీతక్క, మంత్రి తుమ్మల

    అక్షరటుడే, ఇందల్వాయి: Minister seethakka | జిల్లా ఇన్​ఛార్జి మంత్రిగా నియమితులైన సీతక్క (Minister Seethakka) ఆదివారం మొదటిసారి...

    Hydraa | పార్క్​లో అక్రమ నిర్మాణలను కూల్చేసిన హైడ్రా

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Hydraa | ప్రభుత్వ భూముల పరిరక్షణకు హైడ్రా (Hydraa) చర్యలు చేపడుతోంది. ప్రజల నుంచి వచ్చే...

    BJP State President | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : BJP State President | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి (BJP State President) ఎన్నికకు...

    More like this

    Char Dham Yatra | చార్​ధామ్ యాత్ర నిలిపివేత

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Char Dham Yatra | ఉత్తరాఖండ్ (Uttarakhand)​లో భారీ వర్షాలు (Heavy Rains) పడుతున్నాయి. వర్షాలు,...

    Minister seethakka | జిల్లాకు విచ్చేసిన ఇన్​ఛార్జి మంత్రి సీతక్క, మంత్రి తుమ్మల

    అక్షరటుడే, ఇందల్వాయి: Minister seethakka | జిల్లా ఇన్​ఛార్జి మంత్రిగా నియమితులైన సీతక్క (Minister Seethakka) ఆదివారం మొదటిసారి...

    Hydraa | పార్క్​లో అక్రమ నిర్మాణలను కూల్చేసిన హైడ్రా

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Hydraa | ప్రభుత్వ భూముల పరిరక్షణకు హైడ్రా (Hydraa) చర్యలు చేపడుతోంది. ప్రజల నుంచి వచ్చే...