అక్షరటుడు, బోధన్: Satapur | దైవ దర్శనానికి వెళ్లిన ఓ కుటుంబం అదృశ్యమైంది. వివరాల్లోకి వెళ్తే.. రెంజల్ మండలం (Renjal) సాటాపూర్ గ్రామానికి చెందిన భార్యాభర్తలు మెగావత్ మోహన్, లక్ష్మి వారి కూతురు శిరీష ఈనెల 14న తిరుపతి వెళ్లారు.
17న తిరిగి వస్తున్నట్లు మోహన్ తన బావమరిది మెగావత్ రవీందర్కు సమాచారం ఇచ్చారు. అనంతరం ఆయన మోహన్ సెల్ఫోన్ స్విచ్ఛాఫ్లో ఉండడంతో రవీందర్ రెంజల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి కుటుంబం ఆచూకీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.