అక్షరటుడే నిజామాబాద్ సిటీ: CP Sai Chaitanya | యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సీపీ సాయి చైతన్య పిలుపునిచ్చారు. యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ వీక్లో (Anti Drugs Awareness Week) భాగంగా పాత కలెక్టరేట్ గ్రౌండ్ నుంచి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గంజాయి, మత్తుపదార్థాల రహిత జిల్లాగా మార్చేందుకు పోలీస్శాఖకు ప్రతిఒక్కరూ సహకరించాలని సూచించారు. మాదక ద్రవ్యాల నిర్మూలన ప్రతిఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.
CP Sai Chaitanya | రాష్ట్రంలో 15 లక్షల మంది..
రాష్ట్రంలో 2015 వరకు 15 లక్షల మంది డ్రగ్స్కు బాధితులుగా మారినట్లు రికార్డులు చెబుతున్నాయని సీపీ సాయిచైతన్య వివరించారు. యువత ఫ్యాషన్ కోసం గంజాయి సేవిస్తున్నట్లు తెలుస్తోందని.. జీవితాలను బుగ్గిపాలు చేసుకోవద్దని హితవు పలికారు. మత్తు పదార్థాల వల్ల జరిగే అనర్థాలను వివరించారు. యాంటీ డ్రగ్స్ ర్యాలీ పాత కలెక్టరేట్ గ్రౌండ్ నుంచి ప్రారంభమై రాజీవ్గాంధీ ఆడిటోరియం వరకు సాగింది.
కార్యక్రమంలో ట్రైయినీ ఐఏఎస్ కరోలిన్, అదనపు పోలీస్ కమిషనర్ బస్వారెడ్డి, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ రసూల్ బీ, ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి, డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి, ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి, విద్యార్థులు, ఎన్సీసీ కేడెట్లు, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.
ర్యాలీని ప్రారంభిస్తున్న సీసీ సాయిచైతన్య