అక్షరటుడే, వెబ్డెస్క్ : Operation Sindoor | పాక్ ఎయిర్బేస్లు, ఎయిర్ డిఫెన్స్ సిస్టం, మిలిటరీ స్థావరాలపై దాడులు చేసినట్లు త్రివిద దళాదిపతులు తెలిపారు. డీజీఎంవో రాజీవ్ఘాయ్, ఎయిర్ మార్షల్ ఏకే భారతి, నేవీ చీఫ్ ప్రమోద్ ఆదివారం మీడియాతో మాట్లాడారు. పహల్ గామ్ ఉగ్రదాడిలో 26 మంది మృతి చెందారన్నారు. దీనికి ప్రతీకారంగా ఉగ్రవాదులకు బుద్ధి చెప్పడానికి ఆపరేషన్ సిందూర్ చేపట్టామన్నారు. ఉగ్రవాదం అంతానికే ఆపరేషన్ సిందూర్ చేపట్టామన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా 9 ఉగ్రస్థావరాలపై దాడులు చేశామన్నారు. ఈ దాడుల్లో 100 మందికిపైగా ఉగ్రవాదులు చనిపోయారన్నారు. ఇందులో పలువురు కీలక ఉగ్రవాదులు ఉన్నట్లు తెలిపారు.
Operation Sindoor | ప్రజలే లక్ష్యంగా పాక్ దాడులు
ఉగ్రవాదుల అంతానికే ఆపరేషన్ సిందూర్ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. మనం ఉగ్రవాదులే లక్ష్యంగా దాడులు చేస్తే.. పాక్ మాత్రం పౌరులు, ఆలయాలపై దాడులకు యత్నించిందన్నారు. డ్రోన్లు, క్షిపణులు, యుద్ధ విమానాలతో దాడులు చేసిందని పేర్కొన్నారు. అయితే భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టం, వైమానిక దళం పాక్ దాడులను తిప్పికొట్టాయని వివరించారు.
Operation Sindoor | 40 మంది పాక్ సైనికుల మృతి
ఎల్వోసీ వెంబడి పాక్ కాల్పులకు తెగబగడంతో భారత్ ప్రతిదాడులు చేసిందన్నారు. ఈ ఘటనలో 35 నుంచి 40 మంది పాకిస్తాన్ సైనికులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. పౌర విమానాలను రక్షణగా పెట్టుకొని పాక్ దాడులకు పాల్పడిందన్నారు. దీంతో సంయమనంతో ఎదురు దాడులు చేశామని వివరించారు.
Operation Sindoor | పాక్ దాడులను తిప్పికొట్టాం
ఆపరేషన్ సిందూర్ తర్వాత నిత్యం పాక్ డ్రోన్లు, యుద్ధ విమానాలు, క్షిపణులు దాడులు చేసిందన్నారు. అయితే మన రక్షణ వ్యవస్థ దాడులను తిప్పికొట్టిందన్నారు. పాక్ దాడులతో భారత్కు ఎలాంటి నష్టం జరగలేదన్నారు. అయితే పాక్ దాడులను తిప్పి కొట్టడానికి భారత వైమానిక దళం ప్రతిదాడులు చేసిందన్నారు. మన సత్తా చాటడానికి భారీ క్షిపణులతో దాడులు చేశామన్నారు. లాహోర్లోని రాడార్ వ్యవస్థను ధ్వంసం చేశామని చెప్పారు. మిలిటరీ స్థావరాలు, పసునూర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టంను ధ్వంసం చేశామన్నారు. రాడార్ సిస్టంలపై దాడులు చేశామని వివరించారు.
Operation Sindoor | బలగాలకు పూర్తి స్వేచ్ఛ..
ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయన్నారు. అయితే శనివారం రాత్రి పాక్ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని అధికారులు పేర్కొన్నారు. పాక్ దాడులను తిప్పికొట్టామని, ఒప్పంద ఉల్లంఘన విషయాన్ని పాక్ అధికారుల దృష్టికి తీసుకు వెళ్లామన్నారు. అలాగే మళ్లీ పాక్ దాడులకు పాల్పడితే తీవ్రంగా దాడులు చేయాలని బలగాలకు ఆదేశాలు ఇచ్చామన్నారు. ఇప్పటికే పాక్లోని సైనిక స్థావరాలను పూర్తిగా నిర్వీర్వం చేశామని వివరించారు.