అక్షరటుడే, కామారెడ్డి: Indiramma Housing Scheme | బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అహర్నిషలు కృషి చేస్తోందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (Government Advisor Shabbir Ali) అన్నారు.
భిక్కనూరు(Bhiknoor) మండల కేంద్రంలోని హరిజనవాడ, కుమ్మరిగల్లిలో శుక్రవారం లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశారు. అనంతరం ఇళ్ల నిర్మాణానికి ముగ్గుపోశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం అప్పుల్లో ఉన్నా పేదలకు ఇచ్చిన మాట ప్రకారం హామీలను అమలు చేస్తున్నామన్నారు. నియోజకవర్గానికి 3,028 మంది లబ్ధిదారులను ఎంపిక చేశామన్నారు. త్వరలో మరో 472 లబ్ధిదారులను ఎంపిక చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు ఇంద్రకరణ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.