ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Andhra Pradesh | అనంతపురంలో విషాదం.. గొంతులో దోశ ముక్క ఇరుక్కొని రెండేళ్ల బాలుడు మృతి

    Andhra Pradesh | అనంతపురంలో విషాదం.. గొంతులో దోశ ముక్క ఇరుక్కొని రెండేళ్ల బాలుడు మృతి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Andhra Pradesh | ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా (Anantapur District) తపోవనంలో ఓ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. రెండేళ్ల చిన్నారి(Two Years Old Boy) కుశల్‌ గొంతులో దోశ ముక్క ఇరుక్కోవడంతో ఊపిరాడక మృత్యువాత పడ్డాడు. తల్లిదండ్రులు కళ్ళముందే బిడ్డ ప్రాణాలు కోల్పోవడంతో వారు క‌న్నీరు మున్నీరుగా విలపించారు. ఆ దృశ్యాలు ప్ర‌తి ఒక్క‌రి హృదయాన్ని కదిలించాయి.

    వివరాల్లోకి వెళ్తే.. తపోవనానికి చెందిన చిన్నారి కుశల్ (2) తన తల్లితో కలిసి భోజనం చేస్తున్న సమయంలో దోశ(Dosa) ముక్కను తొందరపడి నోట్లో వేసుకున్నాడు. అది గొంతులో (Throat) ఇరుక్కొని అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే అతని ప్రాణం పోయిన‌ట్టు వైద్యులు ధ్రువీకరించారు.

    READ ALSO  Urea | రామగుండం ఎరువుల కర్మాగారంలో నిలిచిన యూరియా ఉత్పత్తి.. ఎందుకంటే..!

    Andhra Pradesh | ఊహించ‌ని ప్ర‌మాదం..

    ఈ వార్త విన్న కుటుంబసభ్యులు, స్నేహితులు, పంచాయితీ ప్రజలు విషాదంలో మునిగిపోయారు. కుశల్ తల్లి శోకసంద్రంలో కూరుకుపోయి ఆ చిన్నారి కోసం కన్నీరుమున్నీరుగా విల‌పించింది. తల్లిదండ్రుల రోదనలు స్థానికులను కంటతడి పెట్టించాయి.

    ఈ ఘటనపై వైద్యులు, పిల్లల నిపుణులు స్పందిస్తూ చిన్నారులు తిండి తినే సమయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. చిన్న పిల్లలకు మింగలేనివి, గొంతులో ఇరుక్కొయ్యే ఆహార పదార్థాలు తినిపించేటప్పుడు శ్రద్ధ వహించాలన్నారు. చిన్నారులు ఆడుకుంటున్నప్పుడు ఏవైనా వస్తువులు నోట్లో పెట్టుకోవడం వల్ల కూడా ఇలాంటి ప్రమాదాలు సంభవించవచ్చని వైద్యులు తెలిపారు.

    చిన్న వయస్సులో పిల్లల గొంతు మార్గాలు బలహీనంగా ఉంటాయి. తినే పదార్థాలను చిన్న ముక్కలుగా చేసి, నెమ్మదిగా తినిపించాలి. తినే సమయంలో పిల్లలపై (Childrens) దృష్టి పెట్టాలి అని సూచిస్తున్నారు వైద్యులు. చిన్న తప్పిదం వల్లే తల్లిదండ్రులు జీవితాంతం భరించలేని విషాదానికి లోను కావ‌ల్సి వ‌చ్చింది. ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ఉండేందుకు అన్ని కుటుంబాల్లోనూ చిన్నారుల ప‌ట్ల ప్ర‌త్యేక శ్ర‌ద్ధ వ‌హించాలి.

    READ ALSO  Minister Sridharbabu | ఒక్క చుక్క నీటిని వ‌దులుకోం.. మంత్రి శ్రీ‌ధ‌ర్‌బాబు స్ప‌ష్టీక‌ర‌ణ‌

    Read all the Latest News on Aksharatoday and also follow us in ‘X‘ and ‘Facebook

    Latest articles

    Liquor Scam | లిక్కర్ స్కాం కేసులో ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Liquor Scam | ఏపీ మద్యం కుంభకోణం (AP Liquor Scam) కేసులో కీలక...

    Air India | మరో విమానంలో సాంకేతిక లోపం.. అత్యవసర ల్యాండింగ్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Air India | విమానాల్లో సాంకేతిక లోపాలతో (Technical Issue) ప్రయాణికులు హడలిపోతున్నారు. ఫ్లైట్...

    Bonalu Festival | మద్యంప్రియులకు బ్యాడ్ న్యూస్​.. రేపు వైన్స్ లు​ బంద్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Bonalu Festival | హైదరాబాద్​ నగరంలో (Hyderabad City) బోనాల పండుగ ఘనంగా జరుగుతోంది. గోల్కొండ...

    Kodanda Reddy | ప్రభుత్వానికి రూ.4 కోట్ల విలువైన భూమి విరాళం ఇచ్చిన రైతు కమిషన్​ ఛైర్మన్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kodanda Reddy | తెలంగాణ రైతు కమిషన్ ఛైర్మన్ (Farmers Commission Chairman) కోదండ...

    More like this

    Liquor Scam | లిక్కర్ స్కాం కేసులో ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Liquor Scam | ఏపీ మద్యం కుంభకోణం (AP Liquor Scam) కేసులో కీలక...

    Air India | మరో విమానంలో సాంకేతిక లోపం.. అత్యవసర ల్యాండింగ్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Air India | విమానాల్లో సాంకేతిక లోపాలతో (Technical Issue) ప్రయాణికులు హడలిపోతున్నారు. ఫ్లైట్...

    Bonalu Festival | మద్యంప్రియులకు బ్యాడ్ న్యూస్​.. రేపు వైన్స్ లు​ బంద్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Bonalu Festival | హైదరాబాద్​ నగరంలో (Hyderabad City) బోనాల పండుగ ఘనంగా జరుగుతోంది. గోల్కొండ...