అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Drunk Drive | డ్రంకన్ డ్రైవ్లో ఇద్దరికి జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ (Traffic ACP Mastan Ali) తెలిపిన వివరాల ప్రకారం.. ఇన్స్పెక్టర్ ప్రసాద్ (Inspector Prasad) ఆధ్వర్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు చేయగా.. 11 మంది మద్యం సేవించి పట్టుబడ్డారు. వీరిని శుక్రవారం సెకండ్క్లాస్ మెజిస్ట్రేట్ నూర్జహాన్ (Second Class Magistrate NoorJahan) ఎదుట హాజరుపర్చగా 9 మందికి రూ.14,500 జరిమానా వేశారు. ఇద్దరికి ఒక్కోరోజు జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చారని ట్రాఫిక్ ఏసీపీ తెలిపారు.
Drunk Drive | మద్యం సేవించి వాహనాలు నడపొద్దు..
ఈ సందర్భంగా ట్రాఫిక్ ఏసీపీ మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టప్రకారం కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముఖ్యంగా మద్యం తాగి డ్రైవింగ్ చేయడం ద్వారా వారి ప్రాణాలకే కాకుండా ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదం పొంచి ఉంటుందన్నారు.
Drunk Drive | మైనర్లకు వాహనాలు ఇస్తే..
ముఖ్యంగా మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలు ఇస్తే.. వారి తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని ట్రాఫిక్ ఏసీపీ పేర్కొన్నారు. ఎట్టిపరిస్థితుల్లో మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని సూచించారు.