అక్షరటుడే, వెబ్డెస్క్: Traffic control : కొందరు వాహనదారులు రెడ్ సిగ్నల్ పడినా రోడ్డు దాటేస్తుంటారు. ఇంకొందరు అతివేగంగా వాహనాలు నడపడం, సీట్ బెల్ట్ ధరించకుండా ఫోర్వీలర్ వెహికిల్ డ్రైవ్ చేస్తుంటారు. ఇంకొందరు హెల్మెట్ పెట్టుకోకుండా బైక్పై రయ్ మంటూ వెళ్లిపోతుంటారు.
ఇలా అడ్డగోలుగా ట్రాఫిక్ నిబంధలు ఉల్లంఘించేవారి ఆటకట్టించేందుకు నాగ్పుర్ మున్సిపల్ కార్పొరేషన్ చర్యలకు ఉపక్రమించింది. ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించేవారిని ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ)(Artificial Intelligence – AI) సాయంతో గుర్తించి జరిమానాలు వేయబోతోంది.
Traffic control : పది కూడళ్లలో…
నగరంలో ట్రాఫిక్ ను నియంత్రించేందుకు నాగ్పుర్ మున్సిపల్ కార్పొరేషన్ (Nagpur Municipal Corporation) ఏఐ ఆధారిత ‘ట్రాఫిక్ సిగ్నల్ సిస్టమ్’ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. తద్వారా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడానికి ప్రయత్నించే వారి వాహన నంబరు ప్లేట్ను నేరుగా స్కాన్ చేసి, భారీ జరిమానాలు వేయనుంది.
మహారాష్ట్ర(Maharashtra)లో మొదటి ఏఐ ఆధారిత సిగ్నల్ సిస్టమ్ ఇది. దీనిని మొదటి దశలో నాగ్పూర్ (Nagpur) లోని పది కూడళ్లలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నారు. జంక్షన్ల వద్ద ఒకవైపు నుంచి వచ్చే వాహనాల సంఖ్య ఎక్కువగా పెరిగితే ఆ వైపు సిగ్నల్ను కృత్రిమ మేధస్సు ఆటోమేటిక్గా ఆకుపచ్చ రంగులోకి మార్చుతుంది. రోడ్డుపై వాహనాల రద్దీని పరిగణనలోకి తీసుకుని పరిస్థితిని బట్టి ఏఐ వ్యవస్థ స్వయంచాలకంగా పనిచేస్తుంది.
ఈ ఏఐ ఆధారిత వ్యవస్థను ‘ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్’ (‘Integrated Intelligence Traffic Management System’) అని కూడా పేర్కొంటారు. ఈ ప్రాజెక్టును నాగ్పుర్ మున్సిపల్ కార్పొరేషన్ చేపడుతోంది. మొదట నగరంలోని పది జంక్షన్లలో, తర్వాత నగర వ్యాప్తంగా దశలవారీగా ఏఐ సిగ్నల్ను విస్తరించనుంది.
ఇటీవలి కాలంలో నాగ్పుర్లో వాహనాలను అతివేగంగా నడిపేవారు పెరిగిపోయారు. ట్రాఫిక్ సిగ్నల్ను ఉల్లంఘించేవారి సంఖ్య కూడా పెరిగిందని ఫిర్యాదులు అందుతున్నాయి. దీనికి పరిష్కారంగా ఈ ఏఐ సిగ్నల్ వ్యవస్థ(AI signal system)లో ‘వేగ ఉల్లంఘన గుర్తింపు’ (‘speed violation detection’) పరికరాన్ని అమర్చుతున్నారు. దీనికితోడు ఏఐ ఆధారిత కెమెరాల(AI-based cameras)ను బిగించుతున్నారు.
Traffic control : ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందంటే..
ట్రాఫిక్ కూడలి వద్ద ఒక వైపు నుంచి వచ్చే వాహనాల సంఖ్య పెరిగిపోతే.. ఆ వైపు సిగ్నల్ను ఏఐ వ్యవస్థ ఆకుపచ్చ రంగులోకి మార్చుతుంది. ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా సిగ్నల్ లైట్లు ఆటోమేటిక్గా మారతాయి. ఈ వ్యవస్థ రోడ్డుపై ప్రయాణ సమయాన్ని 28 నుంచి 48 శాతానికి తగ్గిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రయాణ వేగం కూడా 62 శాతం పెరుగుతుందని భావిస్తున్నారు.